Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త వ్యాపారాలతో నాకు సంబంధం లేదు : శిల్పాశెట్టి

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (09:09 IST)
అడల్ట్ కంటెంట్ తయారీ, ప్రసారం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాపై ముంబై పోలీసులు తాజాగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అయితే.. ఈ కేసులో సాక్షుల జాబితాలో శిల్పాశెట్టి పేరునూ చేర్చారు. 
 
ఈ కేసులో శిల్పాశెట్టి వద్ద పోలీసులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తకరమైన విషయాలను వెల్లడించారు. తన భర్త కార్యకలాపాల గురించి తనకు తెలియదని పోలీసులకు స్పష్టం చేశారు. 
 
'నా పనుల్లో నేను చాలా బిజీగా ఉండేదాన్ని. రాజ్‌కుంద్రా ఏం చేసేవాడో నాకు తెలియదు’ అని వెల్లడించారు. పోలీసులు దాఖలు చేసిన 1,400 పేజీల ఛార్జ్‌షీట్‌లో ఈ విషయాన్ని పొందుపర్చారు. అలాగే అశ్లీల చిత్రాలకు సంబంధించిన యాప్‌ల గురించి కూడా తనకు తెలియదని ఆమె తెలిపారు. 
 
ఈ కేసులో భాగంగా రాజ్ కుంద్రాతో సహా కొంత మంది ఉద్యోగులను జులై 19న పోలీసులు అరెస్టు చేయగా.. వారిలో నలుగురు ఉద్యోగులు అతనికి వ్యతిరేక సాక్షులుగా మారినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా, రాజ్‌కుంద్రాను కోర్టులో విచారిస్తున్న సందర్భంగా తాను తీసిన కంటెంట్‌ అసభ్యకరం కావచ్చు కానీ అశ్లీలమైనది కాదని ఆయన తెలిపారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఇలాంటి వీడియోలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments