Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్ కుంద్రా చెప్పకుండానే ఇంటికొచ్చాడు.. బలవంతంగా కిస్ చేశాడు.. ఎవరు?

Webdunia
గురువారం, 29 జులై 2021 (21:37 IST)
పోర్న్ చిత్రాల కేసులో అరెస్టయిన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై బాలీవుడ్‌ నటి షెర్లిన్‌ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసింది. బిజినెస్‌ డీల్‌ కోసం ఇంటికొచ్చిన రాజ్‌కుంద్రా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది.

ఇదే కేసులో షెర్లిన్‌ చోప్రాకు ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రాపై షెర్లిన్‌ తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భార్య శిల్పాశెట్టితో సంబంధం సంక్లిష్టంగా మారిందని చెబుతూ బలవంతంగా తనకు ముద్దు పెట్టాడని ఆరోపించింది.  
 
2019లో ఓ ప్రపోజల్‌ గురించి రాజ్‌ కుంద్రా తన బిజినెస్‌ మెనేజర్‌కు కాల్‌ చేసినట్లు పేర్కొంది. 2019 మార్చి 27న బిజినెస్‌ మీటింగ్‌ తరువాత రాజ్‌ కుంద్రా ఓ రోజు తనకు చెప్పకుండానే ఇంటికి వచ్చినట్లు తెలిపింది. మెసెజ్‌కు సంబంధించిన వాదనలో సరాసరీ ఇంటికే వచ్చినట్లు తెలిపింది. 
 
అయితే ఇంటికి వచ్చిన రాజ్‌ కుంద్రా తన మాట వినకుండా బలవంతంగా కిస్‌ చేశాడని ఆరోపించింది. కానీ ఒక పెళ్లైన వ్యక్తితో తను రిలేషన్‌షిప్‌ పెట్టుకోవాలని లేదని.. తన ఆనందాలను బిజినెస్‌తో ముడి పెట్టాలని అనుకోలేదని పేర్కొంది.
 
అయితే తన భార్య శిల్పాశెట్టితో సంబంధం సంక్లిష్టంగా ఉందని... ఇంటి వద్ద ఎంతో ఒత్తిడి గురవుతున్నానని రాజ్ కుంద్రా తనతో అన్నాడని చెప్పింది. ఆ సమయంలో తనకు ఎంతో భయం వేయడంతో అతనిని తోసేసి వాష్ రూమ్‌కు పారిపోయానని తెలిపింది. 
 
ఇదిలా ఉండగా రాజ్ కుంద్రాపై షెర్లిన్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కుంద్రా అరెస్ట్ అయిన తరువాత అశ్లీల చిత్రాల కేసుపై షెర్లిన్ చోప్రా ఓ వీడియో స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

ఆకు కూర కట్ట రూ.80 కొనుగోలు - సర్వీస్ చివరి రోజున లేడీ డాక్టర్ సస్పెన్షన్

అధికార మదంతో వంశీపై వరుస కేసులు.. సతీ సావిత్రిలా వంశీ భార్య : పేర్ని నాని

వైకాపా నేతల ఒత్తిడితోనే టీడీపీ ఆఫీసుపై దాడి.. కానీ ఆ రోజు నేను పొలంలో ఉన్నాను : ఆర్కే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం