Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న రొమాంటిక్ హీరో

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (13:35 IST)
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం "పడి పడి లేచే మనసు" చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం తర్వాత శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది.
 
ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్‌ శివార్లలో భారీ సెట్‌ కూడా వేశారు. ఈ చిత్రం షూటింగ్ 50 శాతం మేరకు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను శర్వానంద్ బహిర్గతం చేశారు. 
 
తన తదుపరి చిత్రం సుధీర్ వర్మ సినిమాలో నటిస్తానని ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించనున్నట్టు చెప్పాడు. 1980 బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ సినిమాలో శర్వా రెండు షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. ప్రజెంట్, పాస్ట్ షేడ్స్‌లో శర్వానంద్‌ను ఇందులో చూపించబోతున్నారు. దీనికి సంబంధించిన త్వరలోనే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించాడు.
 
ప్రస్తుతం 'పడిపడి లేచే మనసు' సినిమా ప్రచారంలో ఉన్న శర్వానంద్, ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే సింగిల్ షెడ్యూల్‌లో శర్వానంద్ సినిమాను పూర్తిచేయబోతున్నట్టు ప్రకటించాడు. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments