Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొక్కిసలాట కేసులో బాలీవుడ్ బాద్ షాకు ఊరట

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (08:46 IST)
వడోదర రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమయ్యారని పేర్కొంటూ నమోదైన కేసులో బాలీవుడ్ అగ్రహీరో షారూక్ ఖాన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తద్వారా ఈ కేసులో బాలీవుడ్ బాద్ షాకు పెద్ద ఊరట లభించినట్టయింది. 
 
గత 2017లో "రాయిస్" చిత్ర ప్రమోషన్‌లో భాగంగా షారూక్ తన చిత్ర బృందంో కలిసి ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయనను చూసేందుకు వడోదర రైల్వే స్టేషన్‌కు పోటెత్తారు. షారూక్ వారిపై టీషర్టులు, స్మైలీ బాల్స్ విసిరారు. వీటిని చేజిక్కించుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా రైల్వే స్టేషనులో తొక్కిసలాట చోటుచేసుకుంది. 
 
ఈ తొక్కిసలాట ఘటనకు షారూక్ ప్రధాన కారకుడని పేర్కొంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జితేంద్ర మధుబాయ్ సోలంకి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును కొట్టివేయాల్సిందిగా కోరుతూ షారూఖ్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసును విచారించిన కోర్టు షారూఖ్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. 
 
గుజరాత్ హైకోర్టు తీర్పును ఫిర్యాదుదారుడు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. నిన్న దీనిని విచారించిన జస్టిస్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం షారూఖ్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు

ప్రపంచ ధరిత్రి దినోత్సవం- మన శక్తి, మన గ్రహం థీమ్ ఇదే!

Namo Bharat: ఏప్రిల్ 24న నమో భారత్ రాపిడ్ రైలు సేవను ప్రారంభించనున్న ప్రధాని

Woman Constable: ఆర్థిక ఇబ్బందులు: ఆత్మహత్యకు పాల్పడిన మహిళా కానిస్టేబుల్

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments