Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ను కలిసి షాయాజీ షిండే... మొక్క ప్రసాదంపై సమాచారం షేరింగ్

ఠాగూర్
బుధవారం, 9 అక్టోబరు 2024 (09:22 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌తో సినీ నటుడు షాయాజీ షిండే మంగళవారం భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వీరిద్దరి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తన ప్రతిపాదనను పవన్‌కు వివరించారు. తన ఆలోచలను షిండే లిఖితపూర్వకంగా పవన్‌కు అందజేశారు. దీనపై పవన్ స్పందిస్తూ, షిండే సూచనలు తప్పకుండా పరిశీలిస్తానని తెలిపారు. 
 
కాగా, ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తే ఓ ఆసక్తికర సూచన చేస్తానని చెప్పారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటచు ఒక మొక్కను కూడా భక్తులకు అందజేస్తే పచ్చదనం పెరుగుతుందన్న విషయాన్ని పవన్‌కు వివరిస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనకు పవన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య అరగంటకుపైగా సమావేశం జరిగింది. 
 
మరోవైపు, ఈ భేటీలో షాయాజీ షిండే మరాఠీ పద్యానికి పవన్ కళ్యాణ్ తెలుగు అనువాదం కింది విధంగా ఉంది. 
 
సూర్యుడు ఉదయిస్తే కేవలం రోజు మొదలవుతుంది.
కానీ చెట్టు నాటితే రోజు ఇంకా మంగళమయం అవుతుంది.
చెట్టు మంచి మంచి పళ్ళు ఇస్తుంది.
చెట్టు పూలు ఇస్తుంది, ఆకులు ఇస్తుంది నీడ ఇస్తుంది. 
పక్షులకు ఆకు పచ్చటి అడవిని ఇస్తుంది.
నీడను ఇస్తుంది. 
శ్వాసకు ఆక్సిజన్ ఇస్తుంది.
మంచి ముచ్చట్లు ఇస్తుంది.
అమ్మలా మనల్ని లాలిస్తుంది.
చెట్టంటే... ఔషధం.
చెట్టంటే... దైవం.
ముందు తరాల ఆరోగ్యం కోసం.
పది చెట్లు నాటండి.
చెట్లుంటే మన అభివృద్ధి ఉంటుంది.
జీవితం ఆనందమయం అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments