Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.100 కోట్లకు పైగా గ్రాస్ షేర్‌ను కలెక్ట్ చేసిన "సర్కారువారి పాట"

Webdunia
మంగళవారం, 17 మే 2022 (17:37 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం "సర్కారువారి పాట". పరశురాం దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై నిర్మించారు. ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సోమవారం వరకు రూ.95 కోట్లకు పైగా షేర్‌ను సాధించగా, మంగలవారం రూ.100 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసిందని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, ఈ చిత్రం ఇప్పటివరకు రూ.160 కోట్లకి పైగా గ్రాస్‌ను, రూ.100 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసింది. అయితే, ఈ కలెక్షన్లను అధికారింగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. నిజానికి ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా ఈ రేంజ్‌లో తన దూకుడును చూపిస్తుండటం పట్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 
 
కాగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చగా, మహేశ్ మార్క్ కామెడీ, సముద్రఖని విలనిజం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అలాగే, ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments