బన్నీ ఫంక్షన్‌ను పక్కనబెట్టి.. మహేష్ కోసం వస్తున్న మెగాస్టార్

Webdunia
ఆదివారం, 5 జనవరి 2020 (13:28 IST)
సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు  మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరు అవ్వనున్నారు.
 
ఇదే సమయంలో జరగనున్న ఆల వైకుంఠపురంలో వేడుకకు మాత్రం ముఖ్య అతిథిగా ఎవ్వరు రావడంలేదట. టాలీవుడ్‌లో చిరును మించిన గెస్ట్ ఎవ్వరు లేరని, ఒకవేళ అల వైకుంఠపురం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మరొకరిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే మెగాస్టార్ స్థాయిని తక్కువ చేసినట్లు అవుతుందని బన్నీ భావిస్తున్నాడట. అందుకే చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలవద్దని దర్శక, నిర్మాతలకు సూచించినట్లు సమాచారం. దీంతో ఎవర్ని పిలవకుండానే వేడుకను నిర్వహించాలని చిత్ర యూనిట్ అనుకుంటుందట.
 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురం మూవీ వస్తున్నా సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే, నివేదా పేతురాజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు హిట్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భర్త

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

కాళేశ్వరంలో అవినీతి.. హరీష్ రావు ప్రమేయం వల్లే కేసీఆర్‌కు చెడ్డ పేరు.. కల్వకుంట్ల కవిత

విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments