Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ ఫంక్షన్‌ను పక్కనబెట్టి.. మహేష్ కోసం వస్తున్న మెగాస్టార్

Webdunia
ఆదివారం, 5 జనవరి 2020 (13:28 IST)
సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు  మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరు అవ్వనున్నారు.
 
ఇదే సమయంలో జరగనున్న ఆల వైకుంఠపురంలో వేడుకకు మాత్రం ముఖ్య అతిథిగా ఎవ్వరు రావడంలేదట. టాలీవుడ్‌లో చిరును మించిన గెస్ట్ ఎవ్వరు లేరని, ఒకవేళ అల వైకుంఠపురం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మరొకరిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే మెగాస్టార్ స్థాయిని తక్కువ చేసినట్లు అవుతుందని బన్నీ భావిస్తున్నాడట. అందుకే చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలవద్దని దర్శక, నిర్మాతలకు సూచించినట్లు సమాచారం. దీంతో ఎవర్ని పిలవకుండానే వేడుకను నిర్వహించాలని చిత్ర యూనిట్ అనుకుంటుందట.
 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురం మూవీ వస్తున్నా సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే, నివేదా పేతురాజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు హిట్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments