Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ నటీనటులపై నిషేధం ముమ్మాటికీ సబబే : కన్నడ చిత్రపరిశ్రమ

యురీ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ నటీనటులపై నిషేధం విధించడంలో ఎలాంటి తప్పు లేదని కన్నడ చిత్రపరిశ్రమ అభిప్రాయపడింది. కళ కంటే దేశం గొప్పదని అన్నారు. తొలుత అందరం భారతీయులమని ఆ తర్వాతే కళ అని శాండల్‌వుడ్ నట

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (14:57 IST)
యురీ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ నటీనటులపై నిషేధం విధించడంలో ఎలాంటి తప్పు లేదని కన్నడ చిత్రపరిశ్రమ అభిప్రాయపడింది. కళ కంటే దేశం గొప్పదని అన్నారు. తొలుత అందరం భారతీయులమని ఆ తర్వాతే కళ అని శాండల్‌వుడ్ నటీనటులు ముక్తకంఠంతో వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ స్పందిస్తూ పాకిస్థాన్ నటీనటులను నిషేధించడం సరైన చర్యేనని వ్యాఖ్యానించారు. డైరెక్టర్ పవన్ ఒడయార్ కూడా నిషేధాన్ని సమర్థించారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు ప్రతి ఒక్కరూ బాసటగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
అదేసమయంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. పాకిస్థాన్ నటులను నిషేధించడం ద్వారా సైనికులకు మద్దతు ఇవ్వాలని ప్రముఖ హీరోయిన్ సంజన వ్యాఖ్యానించారు. శాండల్‌వుడ్‌కు చెందిన మరో హీరో చేతన్, నిర్మాత ఎంఎస్ రమేశ్ తదితరులు కూడా పాక్ నటులపై నిషేధాన్ని సమర్థించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments