Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైత‌న్య‌, స‌మంత‌ల రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ప్రారంభం

మోస్ట్ ఏవైటెడ్ కాంబినేషన్ నాగచైతన్య-సమంత జంటగా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి "నిన్ను కోరి"తో ప్రేక్షకు

Webdunia
సోమవారం, 23 జులై 2018 (16:17 IST)
మోస్ట్ ఏవైటెడ్ కాంబినేషన్ నాగచైతన్య-సమంత జంటగా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి "నిన్ను కోరి"తో ప్రేక్షకులను విశేషంగా అలరించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్ర ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి బౌండెడ్ స్క్రిప్ట్‌ను దర్శకుడు శివ నిర్వాణకు అందించారు. నాగచైతన్య-సమంత వివాహం అనంతరం నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం.
 
దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీనివాస్ అవసరాల, రావు రమేష్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ రెండోవారం నుంచి మొదలవుతుంది. గోపీసుందర్ సంగీత సారథ్యం వహించనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నిర్మాత నవీన్ యెర్నేని, రచయిత కోన వెంకట్ పాల్గొన్నారు.
 
నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్, రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల, పోసాని కృష్ణమురళి, శత్రు, రాజశ్రీ నాయర్ తదితరులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి రచన-దర్శకత్వం: శివ నిర్వాణ, నిర్మాతలు: సాహు గారపాటి-హరీష్ పెద్ది, నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్ , సంగీతం: గోపీ సుందర్ ఛాయాగ్రహణం: విష్ణు శర్మ, ప్రోడ్కషన్ డిజైనర్: సాహి సురేష్, కూర్పు: ప్రవీణ్ పూడి, కో-డైరెక్టర్: లక్ష్మణ్ మూసులూరి లైన్ ప్రొడ్యూసర్: నాగమోహన్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments