Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితురాలి పెళ్లిలో మెరిసిన సమంత.. దిల్‌రాజుకు అలా షాకిచ్చిందట..?

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (11:30 IST)
పెళ్లికి తర్వాత స్టార్ హీరోలతో పాటు సోలోగా అదరగొట్టేస్తున్న సమంత.. తాజాగా మజిలీ సినిమాకు తర్వాత పారితోషికం పెంచాలని నిర్ణయించుకుందట. పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు అంతంత మాత్రంగానే రావడంతో.. పారితోషికం పెంచేయాలని సమంత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పారితోషికాన్ని రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పెంచాలని సమంత చూస్తోందట. 
 
ఇప్పటికే తనను సంప్రదించిన నిర్మాతలకి అదే మొత్తం చెప్పిందని టాక్. నాని, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం సమంతను సంప్రదించారట. అయితే, ఆమె అడిగిన పారితోషికానికి జడిసి దిల్ రాజు వద్దనుకున్నారని సమాచారం. 
 
ఈ సంగతిని పక్కనబెడితే.. దక్షిణాది టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత, తన స్నేహితురాలి పెళ్లి వేడుకల్లో పాల్గొని సందడి చేసింది. క్రైస్తవ సంప్రదాయంలో జరిగిన స్నేహితురాలి వివాహంలో సమంత పాల్గొంది. 
 
ఇందుకు సంబంధించిన ఫోటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ ఫోటోల్లో వధువు తెలుపు రంగు దుస్తుల్లో మెరుస్తుండగా, సమంత సహా ఆమె స్నేహితులంతా నీలి రంగు వస్త్రాల్లో ఉన్నారు. కాగా, ప్రస్తుతం మజిలీ చిత్రం విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆమె, తదుపరి '96' రీమేక్‌లో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments