Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైత‌న్య‌, స‌మంత‌ల 'మ‌జిలీ' ఆ క్ల‌బ్‌లో... లవర్ పాయింట్ టచ్ చేసినందుకా?

Advertiesment
Nagachaitanya
, మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (20:35 IST)
అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత అక్కినేని జంట‌గా న‌టించిన చిత్రం మ‌జిలీ. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే... ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటుంది. క‌లెక్ష‌న్స్ ఎంత వ‌స్తాయి అనేది మాత్రం కొంచెం డౌట్‌గా ఉండేది సినీ పండితుల‌కు. ఎందుకంటే... ఈ సినిమాలో పెద్ద‌గా కామెడీ లేదు.
 
చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంది. అందుచేత ప్రేక్ష‌కులు ఎంతవ‌ర‌కు రిసీవ్ చేసుకుంటారు అని అక్కినేని అభిమానులు సైతం ఉత్కంఠ‌గా ఎదురు చూసారు. అయితే... 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రిలీజైన 5 రోజుల‌కే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఈ సినిమా రిలీజై రెండు వారాలు అయినా ఇప్ప‌టికీ హౌస్‌ఫుల్ కల‌క్ష‌న్స్‌తో స‌క్స‌ెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి.. 50 కోట్ల క్ల‌బ్‌లో చేరి చైత‌న్య కెరీర్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన సినిమాగా నిలిచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్‌ను ఎప్పటి నుండో అడుగుతున్నా.. ఇప్పటికైనా వచ్చాడే..!: తమన్నా