Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో' దెబ్బకు ప్రభాస్ కొత్త చిత్రం బడ్జెట్ వ్యయం కుదించారు

Webdunia
ఆదివారం, 20 అక్టోబరు 2019 (14:40 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం 'సాహో'. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ముఖ్యంగా, ఉత్తరాదిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా శభాష్ అనిపించుకున్నప్పటికీ.. సౌత్‌లో మాత్రం డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. ఫలితంగా చిత్ర పంపిణీదారులు తీవ్ర నష్టాలను చవిచూశారు. ఈ ప్రభావం ప్రభాస్ కొత్త మూవీపై పడింది. ఫలితంగా ఈ చిత్ర బడ్జెట్‌లో 40 శాతం మేరకు కోత విధించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సాహో తర్వాత ప్రభాస్ నటించే చిత్రానికి 'జిల్' పేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పూజాహెగ్డే కథానాయిక. పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 
 
అయితే, దేశ వ్యాప్తంగా ప్రభాస్‌కు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అయితే సాహో తర్వాత ఈ మూవీ స్క్రిప్ట్‌లో దర్శకుడు భారీ మార్పులు చేశాడట. అంతేకాదు నిర్మాతలు కూడా ఈ మూవీ బడ్జెట్‌ను 40శాతం తగ్గించారట. 
 
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని రూ.120 కోట్లతో తెరకెక్కిస్తున్నారట. కాగా ఈ మూవీ తదుపరి షెడ్యూల్‌లో నవంబర్‌లో హైదరాబాద్‌లో ప్రారంభం కానుండగా.. ఎలాంటి విరామాలు లేకుండా షూటింగ్‌‌ను ‌జరపనున్నారట. ఈ మూవీని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments