Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్‌బళ్లాపూర్‌లో "ఆర్ఆర్ఆర్" ప్రిరిలీజ్ ఈవెంట్

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (14:13 IST)
ఈ నెల 25వ తేదీన "ఆర్ఆర్ఆర్" చిత్రం విడుదలకానుంది. అయితే, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రిరిలీజ్ ఈవెంట్లు నిర్వహించారు. కర్నాటక రాష్ట్రంలో మాత్రం నిర్వహించలేకపోయారు. దీనికి కారణం కరోనా థర్డ్ వేవ్. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి. దీంతో ఈ నెల 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేలా చిత్ర నిర్మాతలు ప్లాన్ చేశారు. 
 
ఇందులోభాగంగా, కర్నాటక రాష్ట్రంలోని చిక్‌బళ్లాపూర్‌లో ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్‌‍ను నిర్వహించనున్నారు. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ ఫంక్షన్ నిర్వహిస్తామని అధికారికంగా వెల్లడించారు. దీంతో ఇద్దరు హీరోల అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
యూఎస్‌లో 1150 స్క్రీన్‌లలో "ఆర్ఆర్ఆర్"  
ఈ నెల 25వ తేదీన ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల కానుంది. కానీ, యూఎస్‌లో మాత్రం ఒక రోజు ముందుగానే అంటే మార్చి 24వ తేదీనే ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. మొత్తం 1150కి పైగా స్క్రీన్‌లలో రిలీజ్ చేస్తున్నారు. ఒక భారతీయ సినిమా ఈ స్థాయి లొకేషన్స్‌లలో రిలీజే చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రుఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. అయితే, ఈ నెల 24వ తేదీ నుంచే యూఎస్‌లో ప్రీమియర్ షో మొదలవుతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌గా చెప్పుకునే యూకేలోని ఐమాక్స్‌ తెరపై ఈ సినిమా ప్రీమియర్ షోను వేస్తున్నారు. ఇది ఒక రికార్డుగా భావిస్తున్నారు. 
 
కాగా, ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించగా, ఆయన మనసు దోచిన సీత పాత్రలో అలియా భట్ కనిపించనుంది. కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషించారు. కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలువనుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రను పోషించారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments