సచిన్‌, ధోనీ రికార్డుల్ని బ్రేక్ చేశాడు.. రికార్డుల మోత మోగించిన రోహిత్ శర్మ..

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (18:35 IST)
భారత్-వెస్టిండీస్‌ల మధ్య ముంబైలో జరుగుతున్న నాలుగో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ అదరగొట్టేశాడు. భారత జట్టుకు భారీ స్కోర్ నమోదు చేసుకునే విధంగా ధీటుగా ఆడాడు. మొదటి నుంచే ఆచితూచి ఆడుతూ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత చెలరేగి ఆడుతూ కేవలం 137 బంతుల్లోనే 162 పరుగులు సాధించి ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రెండూ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌వే కావడం విశేషం. 
 
అవేంటంటే.. సిక్సర్ల విషయంలోనూ రోహిత్ సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. వన్డేల్లో సచిన్‌ పేరిట వున్న 195 సిక్సర్ల రికార్డును రోహిత్ అధిగమించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఒక్క సిక్సర్ దూరంలో నిలిచిన రోహిత్ ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాది సచిర్ రికార్డును బద్దలుగొట్టాడు. 
 
అలాగే ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఓ వైపు వికెట్లు పడుతున్నా తడబడకుండా భారత ఇన్నింగ్స్‌ను నిలబెడుతూ సెంచరీ సాధించాడు. దీంతో తన కెరీర్లో 21వ సెంచరీ  పూర్తిచేసుకున్నాడు. అయితే ఓపెనర్‌గా రోహిత్‌కు ఇది 19వ సెంచరీ. కేవలం 107 ఇన్నింగ్సుల్లోనే రోహిత్ ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ 115 ఇన్నింగ్సుల్లో శతకాన్ని సాధించాడు. 
 
అతడి కంటే వేగంగా 19 సెంచరీలు సాధించి రోహిత్ ఆ రికార్డును బద్దలుగొట్టాడు. ఇలా అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 19 సెంచరీలు సాధించిన భారత బ్యాట్ మెన్‌గా రోహిత్ నిలిచాడు. ఇలా ఓపెనర్‌గా అత్యధిక శతకాలు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా పేరిట వుంది. అతడు 102 ఇన్నింగ్సుల్లోనే 19 సెంచరీలు పూర్తిచేసుకున్నాడు. ఆమ్లా తర్వాతి రెండో స్థానంలో రోహిత్ నిలిచాడు. 
 
మొత్తంగా భారత్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్‌మెన్స్ జాబితాలో ఎంఎస్ ధోని (211 సిక్సర్లు) మొదటి స్థానంలో ఉండగా రోహిత్ 198 సిక్సర్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments