Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్‌, ధోనీ రికార్డుల్ని బ్రేక్ చేశాడు.. రికార్డుల మోత మోగించిన రోహిత్ శర్మ..

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (18:35 IST)
భారత్-వెస్టిండీస్‌ల మధ్య ముంబైలో జరుగుతున్న నాలుగో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ అదరగొట్టేశాడు. భారత జట్టుకు భారీ స్కోర్ నమోదు చేసుకునే విధంగా ధీటుగా ఆడాడు. మొదటి నుంచే ఆచితూచి ఆడుతూ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత చెలరేగి ఆడుతూ కేవలం 137 బంతుల్లోనే 162 పరుగులు సాధించి ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రెండూ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌వే కావడం విశేషం. 
 
అవేంటంటే.. సిక్సర్ల విషయంలోనూ రోహిత్ సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. వన్డేల్లో సచిన్‌ పేరిట వున్న 195 సిక్సర్ల రికార్డును రోహిత్ అధిగమించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఒక్క సిక్సర్ దూరంలో నిలిచిన రోహిత్ ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాది సచిర్ రికార్డును బద్దలుగొట్టాడు. 
 
అలాగే ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఓ వైపు వికెట్లు పడుతున్నా తడబడకుండా భారత ఇన్నింగ్స్‌ను నిలబెడుతూ సెంచరీ సాధించాడు. దీంతో తన కెరీర్లో 21వ సెంచరీ  పూర్తిచేసుకున్నాడు. అయితే ఓపెనర్‌గా రోహిత్‌కు ఇది 19వ సెంచరీ. కేవలం 107 ఇన్నింగ్సుల్లోనే రోహిత్ ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ 115 ఇన్నింగ్సుల్లో శతకాన్ని సాధించాడు. 
 
అతడి కంటే వేగంగా 19 సెంచరీలు సాధించి రోహిత్ ఆ రికార్డును బద్దలుగొట్టాడు. ఇలా అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 19 సెంచరీలు సాధించిన భారత బ్యాట్ మెన్‌గా రోహిత్ నిలిచాడు. ఇలా ఓపెనర్‌గా అత్యధిక శతకాలు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా పేరిట వుంది. అతడు 102 ఇన్నింగ్సుల్లోనే 19 సెంచరీలు పూర్తిచేసుకున్నాడు. ఆమ్లా తర్వాతి రెండో స్థానంలో రోహిత్ నిలిచాడు. 
 
మొత్తంగా భారత్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్‌మెన్స్ జాబితాలో ఎంఎస్ ధోని (211 సిక్సర్లు) మొదటి స్థానంలో ఉండగా రోహిత్ 198 సిక్సర్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments