Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది.. ఇరుకు సందుల్లో కాదు..

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (21:17 IST)
SPBalu
గానగంధర్వుడు, సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సంగీత లోకానికి శుక్రవారం బ్లాక్ డేగా మిగిలిపోయింది. 40వేల పాటలు పాడి అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్పీబీకి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ నివాళులర్పించారు. అంతర్జాతీయ మీడియా కూడా ఆయనకు ఘన నివాళులర్పించింది. 
 
అయితే బాలుకు తగిన ప్రాధాన్యం, కవరేజీ ఇవ్వకపోవడంపై జాతీయ మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు దర్శకుడు హరీశ్‌ శంకర్. 'ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది.. అంతేలే.. కొందరి స్థాయి విశ్వవ్యాప్తం.. ఇరుకు సందుల్లో కాదు..' అంటూ ట్వీట్‌ చేశారు. 
 
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో.. రియా చక్రవర్తి అరెస్టుకు సంబంధించి డ్రగ్స్ కేసును విస్తృతంగా జాతీయ మీడియా కవర్ చేస్తున్న నేపథ్యంలో హరీశ్ శంకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతర్జాతీయ మీడియా కూడా బాలు మృతికి ఘనంగా నివాళులర్పించిన నేపథ్యంలో జాతీయ మీడియా మాత్రం ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments