Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది.. ఇరుకు సందుల్లో కాదు..

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (21:17 IST)
SPBalu
గానగంధర్వుడు, సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సంగీత లోకానికి శుక్రవారం బ్లాక్ డేగా మిగిలిపోయింది. 40వేల పాటలు పాడి అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్పీబీకి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ నివాళులర్పించారు. అంతర్జాతీయ మీడియా కూడా ఆయనకు ఘన నివాళులర్పించింది. 
 
అయితే బాలుకు తగిన ప్రాధాన్యం, కవరేజీ ఇవ్వకపోవడంపై జాతీయ మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు దర్శకుడు హరీశ్‌ శంకర్. 'ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది.. అంతేలే.. కొందరి స్థాయి విశ్వవ్యాప్తం.. ఇరుకు సందుల్లో కాదు..' అంటూ ట్వీట్‌ చేశారు. 
 
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో.. రియా చక్రవర్తి అరెస్టుకు సంబంధించి డ్రగ్స్ కేసును విస్తృతంగా జాతీయ మీడియా కవర్ చేస్తున్న నేపథ్యంలో హరీశ్ శంకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతర్జాతీయ మీడియా కూడా బాలు మృతికి ఘనంగా నివాళులర్పించిన నేపథ్యంలో జాతీయ మీడియా మాత్రం ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments