Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

ఠాగూర్
ఆదివారం, 23 మార్చి 2025 (16:35 IST)
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట లభించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ .. రియాకు క్లీన్ చిట్ ఇచ్చింది. గత 2020 జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఈ మరణాన్ని ఆత్మహత్యగా పోలీసులు భావించినప్పటికీ సుశాంత్ తల్లిదండ్రులు తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పైగా, సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. ఈ క్రమంలో రియా చక్రవర్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు కూడా ప్రశ్నించారు. పైగా, సుశాంత్‌కు అధిక మొత్తంలో డ్రగ్స్ ఇచ్చారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రియా, ఆమె సోదరుడు షావిక్ జైలుకు కూడా వెళ్లారు. 
 
తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ తుది నివేదికను కోర్టుకు అందించింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని, చనిపోయేలా ఆయనను ఎవరూ బలవంతం చేయలేదని నివేదికలో కోర్టుకు తెలిపింది. సుశాంత్ మరణంలో మరొకరి ప్రమేయం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. అయితే, సీబీఐ పేర్కొన్న వివరాలు ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఏ మేరకు ఏకీభవిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. సీబీఐ నివేదికను ఆధారంగా చేసుకుని సుశాంత్ కేసును కోర్టు కొట్టివేస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments