Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఆర్డీవో ఆఫీసులో రియా చక్రవర్తి.. సీబీఐ ప్రశ్నల వర్షం

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (11:46 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి శుక్రవారం సీబీఐ విచారణకు హాజరైంది. ఇందుకోసం ఆమె శుక్రవారం ఉదయం తన నివాసం నుంచి డిఆర్డీవో కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పలువురు అధికారులు ఆమెను ప్రశ్నల వర్షంలో ముంచెత్తుతున్నారు. దీంతో ఆమె ఉక్కిరిబిక్కిరైపోతున్నట్టు సమాచారం. 
 
కాగా, సుశాంత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా, ఇప్పటికే అనేక మంది వద్ద విచారణ జరిపిన సీబీఐ అధికారులు... సుశాంతి ప్రియురాలైన రియా చక్రవర్తి వద్ద కూడా విచారణ జరపాలని నిర్ణయించి, ఆమెకు సమన్లు పంపించారు. దీంతో ఆమె శుక్రవారం ఉదయం ముంబైలోని డీఆర్‌డీవో అతిథిగృహానికి వచ్చింది. అక్కడే సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆమెతో పాటు సుశాంత్‌ స్నేహితుడు సిద్ధార్థ్‌ పితానీని కూడా సీబీఐ అధికారులు మరోసారి ప్రశ్నించనున్నాను. 
 
కాగా, గురువారం రియా సోదరుడితో పాటు, సుశాంత్ సింగ్‌ కుటుంబ సభ్యులను కూడా అధికారులు విచారించారు. కాగా, రియా తన కుమారుడిని మానసికంగా వేధించి, డబ్బులు తీసుకుందని సుశాంత్ తండ్రి ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సుశాంత్ ఇంట్లో పనిచేసే వారిని సీబీఐ అధికారులు ప్రశ్నించగా పలు విషయాలు బయటపడ్డాయి. 
 
మరోవైపు, సుశాంత్ మృతి తర్వాత తాను ఎంతో మానసికవేదనకు లోనైనట్టు చెప్పుకొచ్చింది. అందుకే అతని అంత్యక్రియలకు హాజరయ్యే వారి జాబితాలో తన పేరును చేర్చని కారణంగానే వెళ్లలేకపోయానని చెప్పింది. 
 
తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఆమె, సుశాంత్‌ను కడసారి చూసేందుకు మార్చురీ వద్దకు వెళ్లానని, అక్కడ కూడా చాలా సేపు నన్ను లోనికి అనుమతించలేదని, మృతదేహాన్ని వ్యాన్ ఎక్కిస్తుంటే కేవలం మూడు నాలుగు సెకన్లు మాత్రమే చూశానని చెప్పారు.
 
ఆసమయంలో 'సారీ బాబూ' అని రియా వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలపై స్పందిస్తూ, జీవితాన్ని కోల్పోయి, మరణించిన ఓ వ్యక్తిని క్షమించమని కోరడం మినహా తాను ఇంకేం చేయగలనని ప్రశ్నించారు. గౌరవంతో అతని పాదాలను తాకానని, భారతీయుడు ఎవరైనా దీన్ని అర్థం చేసుకుంటారని అన్నారు. సుశాంత్ కుటుంబీకులకు తానంటే ఇష్టం లేదని, అందుకే తనను కష్టాలు చుట్టుముట్టాయని ఆవేదన వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments