Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవినేని నెహ్రూ మరణం నాకు పెద్ద షాక్ : రాంగోపాల్ వర్మ ట్వీట్

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అలియాస్ దేవినేని రాజశేఖర్ మృతిపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. "దేవినేని నెహ్రూ మరణం నాకు పెద్ద షాక్‌. ఆయనతో నేను గడిపిన సమయాన్ని గుర్తు చేస

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (13:40 IST)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అలియాస్ దేవినేని రాజశేఖర్ మృతిపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. "దేవినేని నెహ్రూ మరణం నాకు పెద్ద షాక్‌. ఆయనతో నేను గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటున్నాను. ఆయన ఒక బలమైన రాజకీయ శక్తికి చిహ్నంగా నేను భావిస్తాను" అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. 
 
కిడ్నీ సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన దేవినేని సోమవావం వేకువజామున కన్నుమూసిన విషయం తెల్సిందే. నెహ్రూ మృతిపట్ల విజయవాడ ప్రజలతో పాటు.. టీడీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు దేవినేని మృతికి సంతాపం తెలియజేశారు. అలాగే, రాంగోపాల్ వర్మ కూడా స్పందించారు. 
 
కాగా, రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'వంగవీటి'లో దేవినేని నెహ్రూను హీరోగా చూపించిన విషయం తెల్సిందే. వంగవీటి సినిమా సమయంలోనే పలు సార్లు దేవినేని కుటుంబ సభ్యులతో వర్మ భేటీ అయ్యారు. సినిమాకు సంబంధించిన పలు విషయాల్లో దేవినేని వారి సహాయ సహకారం వర్మకు అందినట్లుగా టాలీవుడ్‌లో చర్చ కూడా సాగింది. 

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments