Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నిర్మాత శేఖర్ రాజుపై ఫిర్యాదు చేసిన ఆర్జీవీ

Webdunia
బుధవారం, 20 జులై 2022 (15:28 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను వివాదాలతో పాటు చిక్కులు కూడా వీడటం లేదు. ముఖ్యంగా ఆయన నిర్మించే చిత్రాలు ప్రకటించిన తేదీల్లో విడుదల కాకుండా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన నిర్మించి "లడ్‌కీ : ఎంటర్ ది డ్రాగన్" చిత్రం కూడా కోర్టు చిక్కులు ఎదురుకావడంతో విడుదలకు నోచుకోలేదు. 
 
ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ హైదరాబాద్‌లోని సివిల్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో చిత్రం విడుదలకు నోచుకోలేదు. మరోవైపు, నిర్మాత శేఖర్ రాజుపై దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, శేఖర్ రాజే తనకు డబ్బులు ఇవ్వాలన్నారు. లఢ్‌కీ చిత్రంపై ఆయన తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదారి పట్టించారని ఆరోపించారు. శేఖర్ రాజుకు తాను ఇవ్వాల్సింది ఏమీ లేదని చెప్పారు. 
 
తప్పుడు సమాచారంతో తన సినిమాను నిలుపుదల చేయించిన శేఖర్ రాజుపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు. నినిమాపై ఆధారపడి ఎంతో మంది బతుకుతున్నారని సినిమా విడుదల కాకుండా ఆగిపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments