Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదాల డైరెక్టర్ నోటి వెంట వింత మాట... జై చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (11:53 IST)
టాలీవుడ్‌లో వివాదాస్పద డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఈ సినిమాను విడుదల చేయడానికి ఏ మాత్రం వెనుకాడకుండా ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఆర్జీవీ. 
 
ఈ సినిమాలో సన్నివేశాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నందున ఇప్పటికే ఈ సినిమాను ఆపివేయాలంటూ పలువురు టీడీపీ కార్యకర్తలు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో ఆర్జీవీ చంద్రబాబును ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.
 
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలపై నాకు 100 పర్సెంట్ నమ్మకం ఉండటానికి కారణం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా అధికార దుర్వినియోగం జరగకుండా, లా అండ్ ఆర్డర్‌కు రౌడీ ఎలిమెంట్స్ ఇబ్బంది కలిగించకుండా నిరోధిస్తారని అనుకుంటున్నాను. జై చంద్రబాబు, జై ఎన్టీఆర్...అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. 
 
ఈ సినిమాను 29న రిలీజ్ చేస్తామని ప్రకటించగా ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో దీని విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆర్జీవీ వరుసలు మీడియా ఛానెల్ల ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నారు. ఇక వెన్నుపోటు నేపథ్యంలో తీసిన ఈ సినిమా విడుదల అనుకున్న తేదీన ఉంటుందో లేదో మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments