Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్డంగా బుక్కైన వర్మ, అమృత ఆర్జీవిని కోర్టు బోనులో నిలబెడుతుందా? (video)

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (15:43 IST)
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం మర్డర్. అమృత, ప్రణయ్, మారుతీరావు కథాంశంతో వర్మ మర్డర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. తనదైన శైలిలో ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసారు. అయితే... ఈ సినిమాపై అమృత కోర్టును ఆశ్రయించారు. దీంతో, అమృత పిటిషన్‌కు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఇప్పటికే వర్మకు ఆదేశాలను జారీ చేసింది.
 
అయితే.. వర్మకు కరోనా సోకిందని... అందువల్ల అఫిడవిట్ పైన సంతకం చేయలేకపోయారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఆగస్టు 14కి కోర్టు వాయిదా వేసింది.
 
 కోర్టుకు తనకు కరోనా సోకిందనే విషయం చెప్పారనే విషయం మరిచిపోయాడో ఏంటో కానీ.. తనకు కరోనావైరస్ లేదని, ఈ విషయం తన గురించి ప్రచారం చేస్తున్న వారికి బాధను కలిగించే అంశమంటూ ఇటీవల వర్మ ట్వీట్ చేసారు.
 
ఈ ట్వీట్‌తో వర్మ అడ్డంగా దొరికిపోయారు. కోర్టుకు వర్మ తప్పుడు సమాచారం అందించారని అమృత ఆరోపించారు. తనకు కరోనా సోకలేదనే విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారని చెప్పారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని అమృత తరపు లాయర్ తెలిపారు. మరి.. కోర్టు ఎలా స్పందిస్తుందో..? వర్మ ఎలా ఏం సమాధానం చెబుతారో..? చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జాతకం ప్రకారం నాకు ఇద్దరు భార్యలు .. రెండో భార్యవు నీవేనంటూ విద్యార్థినికి టీచర్ వేధింపులు...!!

న్యూఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు-నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కుప్పం టూర్

మెదక్ పట్టణంలో 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు

పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్న యువకుడు.. ఎక్కడ?

సరైన పెళ్లి ప్రపోజల్ రాలేదు.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న 32ఏళ్ల వ్యక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments