Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను : రేణూ దేశాయ్

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (10:32 IST)
రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "టైగర్ నాగేశ్వర రావు". ఈ నెల 20వ తేదీన విడుదలకానుంది. అభిషేక్ నామా నిర్మాత. భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ-రీలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషించిన నటి రేణూ దేశాయ్ కూడా పాల్గొని ప్రసంగించారు. 
 
తాను ఇండస్ట్రీకి వచ్చి 23 యేళ్లు అయింది. అయినా తాను నటించిన "బద్రీ" చిత్రం ఇటీవలే విడుదలైందనే ఫీలింగ్ కనిపిస్తుంది. ఇంతకాలంగా తాను తెలుగు సినిమాలు చేయకపోయినా, మీరంతా అదే ప్రేమను చూపిస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతూ వచ్చారు.. మీ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను అని అన్నారు. 
 
అలాగే, ఈ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదలు. హీరో రవితేజ వంటి సీనియర్ హీరోతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయం నాకు ఎంత ప్రాధాన్యత ఉందో ఆయనకి తెలియదు. ఈ వేదిక ద్వారా.. పర్సనల్ గాను రవితేజకు థ్యాంక్స్ చెబుతున్నాను. అంతా కూడా ఈ నెల 20వ తేదీన థియేటర్స్‌కి వెళ్లి ఈ సినిమా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అని రేణూ దేశాయ్ అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments