Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాక్షి టీవీ మైక్ ఎందుకు పట్టుకున్నానంటే..? రేణూ దేశాయ్

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (19:00 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్.. సాక్షి టీవీకి మద్దతు తెలుపుతూ ప్రచారం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ప్రస్తుతం రేణూ స్పందించారు. కర్నూలు జిల్లాలో పవన్ పర్యటించిన అదే సమయంలో రేణూ కూడా ఆ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మైకు పట్టుకుని రైతుల వద్ద ఇంటర్వ్యూ తీసుకున్నారు. 
 
ఈ పర్యటన సందర్భంగా రేణు దేశాయ్ సాక్షి టీవీ రిపోర్టర్ అవతారం ఎత్తడం జనాల్లో పలు అనుమానాలను రేకెత్తించింది. పవన్‌కు వ్యతిరేకంగా రేణును వైసీపీ రంగంలోకి దించిందని జోరుగా ప్రచారం సాగింది.

ఈ వార్తలపై రేణూ దేశాయ్ స్పందిస్తూ.. రైతుల జీవితాలను, వారికష్టనష్టాలను వెలుగులోకి తెచ్చేందుకే సాక్షి మైక్ చేతబట్టానని చెప్పారు. అంతేకానీ ఇందుకు రాజకీయాలకు ముడిపెట్టవద్దని... ఓ టీవీ కార్యక్రమంలో భాగంగా రైతుల కష్టాలను షూట్ చేయాల్సి వచ్చిందని రేణూ దేశాయ్ వెల్లడించారు. 
 
ఇప్పటి వరకు తాను 200 మంది రైతులను కలిశానని, వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయని రేణూ దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సహకారం అందించేలా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని, తన కార్యక్రమం వల్ల ఒక్క రైతైనే బాగుపడినా సంతోషిస్తానని వెల్లడించారు. రైతుల కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ పని చేశానని.. రైతుల కోసం ఓ సినిమా రాశాను. దానికి అనుగుణంగానే రైతులను కలిశానని రేణు దేశాయ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

పాకిస్థాన్ వంకర బుద్ధి.. కవ్వింపు చర్యలు.. ఆరు డ్రోన్లను కూల్చివేసిన భారత్

భార్య సోదరితో భర్త వివాహేతర సంబంధం: రోడ్డుపై భర్తపై దాడికి దిగిన భార్య (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం... ఉత్తరాంధ్రకు భారీ వర్షం

Kanchipuram: కాంచీపురం పట్టుచీరలకు ఫేమస్.. ఆలయాలకు ప్రసిద్ధి.. అలాంటిది ఆ విషయంలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments