Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుద్దాల అశోక్ తేజకు కాలేయ మార్పిడి చికిత్స విజయవంతం

Webdunia
ఆదివారం, 24 మే 2020 (16:01 IST)
ప్రముఖ తెలుగు సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ‌కు కాలేయ మార్పిడి చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో ఆయనకు ఈ ఆపరేషన్ జరిగింది. ఇది విజయవంతంగా పూర్తిచేసినట్టు వైద్యులు తెలిపారు. 
 
శనివారం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయనకు ఈ చికిత్స జరిగింది. అదేసమయంలో అశోక్‌ తేజకు కాలేయం దానం చేసిన ఆయన కుమారుడు అర్జున్‌కు కూడా వైద్యులు ఆపరేషన్‌ చేశారు. శనివారం సాయంత్రం అశోక్ తేజ తమ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసిన వైద్యులకు ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.
 
కాగా, ఇటీవల అనారోగ్యం పాలైన సుద్దాల అశోక్ తేజను ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే, ఆయనకు అత్యవసరంగా కాలేయ మార్పిడి చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. అదేసమయంలో బి నెగెటివ్ బ్లడ్ అధిక మొత్తంలో కావాల్సివుండటంతో చిరంజీవి బ్లడ్ బ్యాంకును సంప్రదించగా, వారు ముందుకు వచ్చారు. ఇలా అన్ని సమకూర్చుకున్న తర్వాత శనివారం ఈ కాలేయ మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments