కంగనాతో కలిసి పనిచేయడం అసౌకర్యంగా ఫీలవుతున్నా.. పీసీ శ్రీరామ్

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:39 IST)
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాలీవుడ్ వివాదాస్పద ప్రముఖ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కనున్న ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేస్తూ.. 'కంగనా ప్రధాన పాత్రధారిణిగా ఓ ప్రాజెక్టు తెరకెక్కించాల్సివుంది. కానీ, ఆమెతో కలిసి పనిచేయడం అసౌకర్యంగా భావించాను. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలకు చెప్పగా, వారు అంగీకరించారు. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాను. ఆల్ ది బెస్ట్' అంటూ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
పీసీ శ్రీరామ్ ట్వీట్‌కు కంగనా రనౌత్ రీట్వీట్ చేస్తూ.. 'తన గురించి మీకు కలిగిన బాధ లేదా అసౌకర్యం ఏంటో తెలియదు. అయితే, మీరు తీసుకున్న నిర్ణయం సబబే. ధన్యవాదాలు.. ఆల్ ది బెస్ట్' అంటూ పేర్కొన్నారు. 
 
కాగా, కంగనా రనౌత్ ఇపుడు జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెల్సిందే. ముంబైను ఓ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చారు. దీంతో శివసేన పార్టీ నేతలు ఆమెపై కారాలుమిరియాలు నూరుతున్నారు. ఫలితంగా శివసేన - కంగనా రనౌత్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Couple on a bike: నడి రోడ్డుపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట (video)

మొంథా తుఫాను సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

శ్రీకాకుళంలో తొక్కిసలాట- మృతులకు 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా : నారా లోకేష్ (video)

కాశీబుగ్గ తొక్కిసలాట.. అసలేం జరిగింది.. తొక్కిసలాటకు కారణం ఏంటి?

మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మళ్లీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments