Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరిలో అక్క.. ప్రచారానికి దూరంగా ఎన్టీఆర్... అది బయటకు పొక్కకూడదనే...

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (17:30 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో దివంగత నటుడు నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి వెంకట సుహాసిని పోటీచేస్తున్నారు. ఈమె హైదరాబాద్‌ కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆమె విజయం కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, హీరోలు బాలకృష్ణ, తారకరత్న వంటివారు ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆమె సోదరుడు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు కూడా పాల్గొంటారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ, వారిద్దరూ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. 
 
అయితే, ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటానికి గల కారణాలు ఏంటో ఇపుడు బహిర్గతమయ్యాయి. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తీస్తున్న చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మెగా హీరోగా కూడా ఉన్నారు. ఈ చిత్రం కోసం జూనియర్ ఎన్టీఆర్ బాగా బరువు పెరుగుతున్నారట. 
 
అందుకు సంబంధించిన ఓ ఫోటో కూడా వైరల్ అవుతోంది. దాదాపు 100 కేజీలకు పైగా బరువుతో ఉన్న ఎన్టీఆర్.. తన లుక్‌ రివీల్ కాకూడదన్న జక్కన్న సూచనతోనే బయటకు రావడం లేదని అంటున్నారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ సోదరిని గెలిపించాలని నందమూరి బ్రదర్స్ కళ్యాణ్ రామ్, తారక్‌లిద్దరూ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments