Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మిక ఏడుపు.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (17:38 IST)
సూపర్ హిట్ సినిమా ఛలోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న క్రేజు ఇప్పుడు చెప్పనక్కర్లేదు. గీత గోవిందంలో విజయ్ దేవరకొండతో నటించిన ఈ భామకు, సినిమా హిట్ కావడంతో క్రేజు మరింత పెరిగింది. దేవదాస్ సినిమా రాణించకపోవడంతో కొంత నిరాశపరిచినా, త్వరలో డియర్ కామ్రేడ్‌తో మరోసారి తెరమీదకు వచ్చి ప్రేక్షకులను అలరించబోతోంది. 
 
గీతగోవిందం సినిమా షూటింగ్‌లో తనకెదురైన సంఘటన గురించి ఇటీవల రష్మిక ఓ ఇంటర్వూలో వెల్లడించింది. ఓ రోజు రష్మిక షూటింగ్ లొకేషన్‌కు ఆలస్యంగా వెళ్లిందట. చిత్ర యూనిట్ సభ్యులెవరూ తనతో మాట్లాడలేదట. అందరూ ముభావంగా ఉండటంతో ఏం జరిగిందో తెలియక కన్నీరు పెట్టుకున్నానని చెప్పింది. ఇంతలో డైరెక్టర్ పరశురామ్ తన దగ్గరకు వచ్చి అసలు విషయం చెప్పి ఓదార్చాడట. 
 
అసలు ఏం జరిగిందంటే. రష్మిక బాధపడుతున్నప్పుడు హావభావాలను న్యాచురల్‌గా క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంతో అందరూ కలిసి ఆటపట్టించామని చెప్పాడట. పరశురామ్ ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ను సినిమాలో ఎక్కడ పెట్టారో రష్మిక చెప్పలేదు. అది చెప్తే సినీ అభిమానులు మళ్లీ చూసి ఆనందిస్తారుగా...!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy rain alert: అల్పపీడనం శక్తి తుఫాన్‌గా మారింది.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Pawan Kalyan: టెక్కలిలో సినిమా తెరపై మన ఊరు - మాటామంతి.. పవన్ ఐడియా

మూలిగే నక్కపై తాటిపండు పండింది... వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

వైకాపా నేత బోరుగడ్డ ఇక జైలుకే పరిమితమా?

Minor girl: 15 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments