Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా ముందుకు మెగా ప్రిన్సెస్.. ఎవరి పోలికో చెప్పిన చెర్రీ!

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2023 (15:28 IST)
మెగా ప్రిన్సెస్‌ మీడియా ముందుకు వచ్చింది. హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల ఓ అడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఉపాసన సుఖ ప్రసవం కావడంతో ఆమెను శుక్రవారం వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత తన కుమార్తెతో కలిసి చరణ్ - ఉపాసన దంపతులు మీడియా ముందుకు వచ్చారు. అయితే, చిన్నారి ముఖం కనిపించకుండా వస్త్రంతో కప్పి ఉంచారు. 
 
ఈ సందర్భంగా చరణ్ మీడియాతో మాట్లాడుతూ, తల్లి, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. మంచి వైద్య బృందం ఉందని ఎలాంటి సమస్యా లేదని, ఎలాంటి భయం కూడా లేదని చెప్పారు. అభిమానులు చేసిన ప్రార్థనలు చాలా గొప్పవన్నారు. ఇంతకంగా ఆనందం ఏముంటుందని చెప్పారు.
 
బిడ్డకు అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. కుమార్తె ఎవరి పోలిక్ అని మీడియా మిత్రులు అడగ్గా... మరో క్షణం తడుముకోకుండా మా నాన్న పోలికే అని చెర్రీ సమాధానమిచ్చారు. అలాగే, పాపకు ఏం పేరు పెట్టబోతున్నారని అని అడగ్గా.. ఏం పేరు పెట్టాలనేది తాను, ఉపాసన కలిసి నిర్ణయించామని, సంప్రదాయం ప్రకారం 21వ రోజున ఈ పేరును వెల్లడిస్తామని తెలిపారు. బిడ్డను తొలిసారి చూసినపుడు, తాకినపుడు అందరు తల్లిదండ్రుల మాదిరిగానే తాను కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హత్రాస్‌ జిల్లాలో తొక్కిసలాట- 80కి చేరిన మృతుల సంఖ్య

రైతు ఆత్మహత్య.. సీరియస్‌గా తీసుకున్న సీఎం.. రూ.25లక్షలు డిమాండ్

కుమార్తెను గర్భవతిని చేసిన కిరాతక తండ్రికి 101 యేళ్ళ జైలు!

ఉత్తరప్రదేశ్‌‌, హత్రాస్‌లో తొక్కిసలాట.. 27మంది మృతి.. మహిళలే ఎక్కువ

ప్యారిస్‌లో అరకు కాఫీ.. చంద్రబాబు నాయుడు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments