Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా ముందుకు మెగా ప్రిన్సెస్.. ఎవరి పోలికో చెప్పిన చెర్రీ!

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2023 (15:28 IST)
మెగా ప్రిన్సెస్‌ మీడియా ముందుకు వచ్చింది. హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల ఓ అడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఉపాసన సుఖ ప్రసవం కావడంతో ఆమెను శుక్రవారం వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత తన కుమార్తెతో కలిసి చరణ్ - ఉపాసన దంపతులు మీడియా ముందుకు వచ్చారు. అయితే, చిన్నారి ముఖం కనిపించకుండా వస్త్రంతో కప్పి ఉంచారు. 
 
ఈ సందర్భంగా చరణ్ మీడియాతో మాట్లాడుతూ, తల్లి, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. మంచి వైద్య బృందం ఉందని ఎలాంటి సమస్యా లేదని, ఎలాంటి భయం కూడా లేదని చెప్పారు. అభిమానులు చేసిన ప్రార్థనలు చాలా గొప్పవన్నారు. ఇంతకంగా ఆనందం ఏముంటుందని చెప్పారు.
 
బిడ్డకు అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. కుమార్తె ఎవరి పోలిక్ అని మీడియా మిత్రులు అడగ్గా... మరో క్షణం తడుముకోకుండా మా నాన్న పోలికే అని చెర్రీ సమాధానమిచ్చారు. అలాగే, పాపకు ఏం పేరు పెట్టబోతున్నారని అని అడగ్గా.. ఏం పేరు పెట్టాలనేది తాను, ఉపాసన కలిసి నిర్ణయించామని, సంప్రదాయం ప్రకారం 21వ రోజున ఈ పేరును వెల్లడిస్తామని తెలిపారు. బిడ్డను తొలిసారి చూసినపుడు, తాకినపుడు అందరు తల్లిదండ్రుల మాదిరిగానే తాను కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆడుదాం ఆంధ్రా స్కామ్‌పై విచారణ పూర్తి : తొలి అరెస్టు మాజీ మంత్రి రోజానేనా?

పిఠాపురంలో వితంతువులకు చీరలు పంచిన పవన్ కళ్యాణ్

13న బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వర్షాలు

నేటి నుంచి తెలంగాణాలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments