Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వర్మ

Webdunia
శనివారం, 28 మే 2022 (17:40 IST)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా వార్తల్లో నిలిచారు. నట్టి క్రాంతి, కరుణ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సీఐ నిరంజన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు అందించారు వర్మ. మా ఇష్టం సినిమా సమయంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు వర్మ పేర్కొన్నారు. 
 
2020 నవంబర్ 30న తన లెటెర్ హెడ్ తీసుకుని నకిలీ పత్రాలు సృష్టించారని.. అందులో తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆరోపించారు. ఫోర్జరీ సంతకంతో వారికి డబ్బులు ఇవ్వాల్సి వున్నట్లు సృష్టించారన్నారు. ఫోర్జరీ సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబుకు పంపి నిజానిజాలు తేల్చాలని కోరారు. ఏప్రిల్‌లో డేంజరస్ సినిమా విడుదల కావాల్సిందని.. నకిలీ పత్రాలతో దావా వేసి సినిమా అడ్డుకున్నారని ఆయన పోలీసులకు వివరించారు. 
 
మరోవైపు ఇటీవల రామ్‌ గోపాల్‌ వర్మపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. శేఖర్ రాజు అనే వ్యక్తి దగ్గర వర్మ 56 లక్షల రూపాయలు తీసుకున్నాడని, ఈ విషయంలో డబ్బులు తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని శేఖర్ రాజు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments