Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వర్మ

Webdunia
శనివారం, 28 మే 2022 (17:40 IST)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా వార్తల్లో నిలిచారు. నట్టి క్రాంతి, కరుణ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సీఐ నిరంజన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు అందించారు వర్మ. మా ఇష్టం సినిమా సమయంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు వర్మ పేర్కొన్నారు. 
 
2020 నవంబర్ 30న తన లెటెర్ హెడ్ తీసుకుని నకిలీ పత్రాలు సృష్టించారని.. అందులో తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆరోపించారు. ఫోర్జరీ సంతకంతో వారికి డబ్బులు ఇవ్వాల్సి వున్నట్లు సృష్టించారన్నారు. ఫోర్జరీ సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబుకు పంపి నిజానిజాలు తేల్చాలని కోరారు. ఏప్రిల్‌లో డేంజరస్ సినిమా విడుదల కావాల్సిందని.. నకిలీ పత్రాలతో దావా వేసి సినిమా అడ్డుకున్నారని ఆయన పోలీసులకు వివరించారు. 
 
మరోవైపు ఇటీవల రామ్‌ గోపాల్‌ వర్మపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. శేఖర్ రాజు అనే వ్యక్తి దగ్గర వర్మ 56 లక్షల రూపాయలు తీసుకున్నాడని, ఈ విషయంలో డబ్బులు తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని శేఖర్ రాజు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments