Ram Charan: ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

సెల్వి
శనివారం, 11 అక్టోబరు 2025 (21:10 IST)
Ramcharan_Upasana_Modi
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా అనిల్ కామినేని నాయకత్వంతో జరిగిన ప్రపంచంలోని మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విశేషాలను తెలిపేందుకు ప్రధాని మోదీకి రామ్ చరణ్ వివరించారు. 
 
ఈ సందర్భంగా చెర్రీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా మోదీని కలిసి ఫోటోలు షేర్ చేశారు. ప్రధాని మోదీ గారిని కలిసినందుకు గౌరవంగా ఉంది. ప్రధాని మార్గదర్శకత్వం, క్రీడల మీద ఉన్న అభిమానం నేడు ఆర్చరీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సాయపడుతుంది’ అంటూ తన పోస్టులో వెల్లడించారు రామ్ చరణ్‌.
 
ప్రస్తుతం చెర్రీ పెద్ది సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నారు. ఏపీలో ఈ షూటింగ్ జరుగుతోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందుతుంది. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. 
 
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న బాబుకి ప్రధానమంత్రి మోడి విషెస్

మా చిలుక కనబడుటలేదు, ఆచూకి చెబితే ఐదు వేలు ఇస్తాం

తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన.. నాలుగు రోజుల పాటు వర్షాలు తప్పవు..

మంచినీళ్లు అనుకుని సలసలలాడే టీని తాగేశాడు, మృతి చెందాడు

Bengaluru: బెంగళూరులో ఘోరం... తొమ్మిదేళ్ల బాలికను ఢీకొన్న బస్సు.. ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments