Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో బిడ్డకు ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించిన ఉపాసన!

వరుణ్
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (14:22 IST)
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు, అపోలో గ్రూపు హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉపాసన మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను రెండో బిడ్డకు ప్లాన్ చేస్తున్నట్టు ఆమె చెప్పారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళల ఆరోగ్యంపై మాట్లాడారు. స్త్రీలు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని, తమని తాము మాత్రమే తప్ప ఇంకెవరూపట్టించుకోరన్నారు. అందువల్ల ప్రతి ఒక్క మహిళకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 
 
మీ జీవితంలో కీలక నిర్ణయాలు ఎలా తీసుకోవాలన్నది తుది నిర్ణయం‌ మహిళలదేనని అభిప్రాయపడ్డారు. తాను పిల్లల్ని ఆలస్యంగా కనాలనుకున్నానని, తన పక్కనున్న మేడమ్‌ కూడా లేట్‌గానే పిల్లలు కావాలనుకున్నారని తెలిపారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు తానేమీ బాధపడటం లేదని, అది తన ఇష్టమని చెప్పారు. ప్రస్తుతం సెకండ్‌ ప్రెగ్నెన్సీకి కూడా తాను రెడీగా ఉన్నట్లు ఆమె చెప్పారు. ఈ మాటలకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, రామ్ చరణ్ చెర్రీ ఉపాసన దంపతులకు ఇప్పటికే క్లీంకార అనే కుమార్తె ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments