Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో బిడ్డకు ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించిన ఉపాసన!

వరుణ్
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (14:22 IST)
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు, అపోలో గ్రూపు హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉపాసన మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను రెండో బిడ్డకు ప్లాన్ చేస్తున్నట్టు ఆమె చెప్పారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళల ఆరోగ్యంపై మాట్లాడారు. స్త్రీలు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని, తమని తాము మాత్రమే తప్ప ఇంకెవరూపట్టించుకోరన్నారు. అందువల్ల ప్రతి ఒక్క మహిళకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 
 
మీ జీవితంలో కీలక నిర్ణయాలు ఎలా తీసుకోవాలన్నది తుది నిర్ణయం‌ మహిళలదేనని అభిప్రాయపడ్డారు. తాను పిల్లల్ని ఆలస్యంగా కనాలనుకున్నానని, తన పక్కనున్న మేడమ్‌ కూడా లేట్‌గానే పిల్లలు కావాలనుకున్నారని తెలిపారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు తానేమీ బాధపడటం లేదని, అది తన ఇష్టమని చెప్పారు. ప్రస్తుతం సెకండ్‌ ప్రెగ్నెన్సీకి కూడా తాను రెడీగా ఉన్నట్లు ఆమె చెప్పారు. ఈ మాటలకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, రామ్ చరణ్ చెర్రీ ఉపాసన దంపతులకు ఇప్పటికే క్లీంకార అనే కుమార్తె ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలు- పవన్

ఉగ్రవాదులతో పోరాడిన ముస్లిం సోదరుడు.. పారిపోలేదు.. చివరికి బుల్లెట్లకు లొంగిపోయాడు..

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments