Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో బిడ్డకు ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించిన ఉపాసన!

వరుణ్
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (14:22 IST)
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు, అపోలో గ్రూపు హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉపాసన మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను రెండో బిడ్డకు ప్లాన్ చేస్తున్నట్టు ఆమె చెప్పారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళల ఆరోగ్యంపై మాట్లాడారు. స్త్రీలు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని, తమని తాము మాత్రమే తప్ప ఇంకెవరూపట్టించుకోరన్నారు. అందువల్ల ప్రతి ఒక్క మహిళకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 
 
మీ జీవితంలో కీలక నిర్ణయాలు ఎలా తీసుకోవాలన్నది తుది నిర్ణయం‌ మహిళలదేనని అభిప్రాయపడ్డారు. తాను పిల్లల్ని ఆలస్యంగా కనాలనుకున్నానని, తన పక్కనున్న మేడమ్‌ కూడా లేట్‌గానే పిల్లలు కావాలనుకున్నారని తెలిపారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు తానేమీ బాధపడటం లేదని, అది తన ఇష్టమని చెప్పారు. ప్రస్తుతం సెకండ్‌ ప్రెగ్నెన్సీకి కూడా తాను రెడీగా ఉన్నట్లు ఆమె చెప్పారు. ఈ మాటలకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, రామ్ చరణ్ చెర్రీ ఉపాసన దంపతులకు ఇప్పటికే క్లీంకార అనే కుమార్తె ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments