Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రిలో చెర్రీ-సమంత సినిమా : సుకుమార్ బిజీ.. ఫోటోలను షేర్ చేసిన చెర్రీ..

ధృవ సినిమా రీమేక్ కావడంతో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. అయినా హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ధృవతో చెర్రీకి కాస్త మంచి పేరు వచ్చింది. అదే ఊపుతో తదుపరి సినిమాకు తేజ్ రెడీ అయిపోయాడు. ఇందులో భాగంగా సుక

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (13:03 IST)
ధృవ సినిమా రీమేక్ కావడంతో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. అయినా హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ధృవతో చెర్రీకి కాస్త మంచి పేరు వచ్చింది. అదే ఊపుతో తదుపరి సినిమాకు తేజ్ రెడీ అయిపోయాడు. ఇందులో భాగంగా సుకుమార్, సమంతలతో కలిసి కొత్త ప్రాజెక్టుకు సంతకం చేశాడు. దీంతో రామ్‌చరణ్- సమంత జంటగా కొత్త ప్రాజెక్ట్ మొదలైంది. ప్రస్తుతం సెట్స్ పైనున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైంది. పోలవరం మండలంలోని శివగిరి- సిరివాక గ్రామాల మధ్య వేసిన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం రాజమండ్రికి చేరుకునే ఫ్లైట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో చెర్రీ షేర్ చేసుకున్నాడు.
 
రాజమండ్రిలో చెర్రీపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. ఇంకా త్వరలో పెళ్లికూతురు కానున్న సమంత ఈ సినిమా ద్వారా మంచి క్రేజ్ కొట్టేయాలని ఉవ్విళ్లూరుతోంది. దాదాపు రెండు వారాల పాటు ఈ ప్రాంతంలో జరిగే ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే చెర్రీతో పాటు ఆయన సోదరి సుస్మిత కూడ వెంట వెళ్లింది. మైత్రి మూవీస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.






















చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments