Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది చేసిన తరువాతే రకుల్‌కు అవకాశం... ఇప్పుడేమో అది నడుపుతోంది... కుర్రాళ్లు క్యూ?

రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అగ్ర హీరోయిన్లలో ఒకరుగా ఉన్న హీరోయిన్. అందాలు ఆరబోయడంలో రకుల్ ప్రీత్ సింగ్ తరువాతే ఎవరైనా అంటుంటారు తెలుగు ప్రేక్షకులు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఫారెన్ అమ్మాయిగా రకుల్ చేసిన అభినయంతో తెలుగు ప్రేక్షకులు

Webdunia
సోమవారం, 29 మే 2017 (13:03 IST)
రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అగ్ర హీరోయిన్లలో ఒకరుగా ఉన్న హీరోయిన్. అందాలు ఆరబోయడంలో రకుల్ ప్రీత్ సింగ్ తరువాతే ఎవరైనా అంటుంటారు తెలుగు ప్రేక్షకులు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఫారెన్ అమ్మాయిగా రకుల్ చేసిన అభినయంతో తెలుగు ప్రేక్షకులు ఆమెకు మరింత దగ్గరయ్యారు. ఆ తరువాత సైజ్ తగ్గించి రారండోయ్ వేడుక చూద్దామంటూ నాగ చైతన్యతో జతకట్టి తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరైంది. 
 
అసలు రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడ పుట్టింది. ఎక్కడ పెరిగింది. అసలెలా సినిమాల్లోకి వచ్చింది. ఎవరికి తెలియదు. రకుల్ ప్రీత్ సింగ్ మొదటగా చిన్నచిన్న యాడ్స్‌లో నటించేది. ఆమె పుట్టింది ఢిల్లీలో. అక్టోబర్ 10, 1990సంవత్సరంలో ఢిల్లీలో పుట్టి పెరిగింది. లెక్కల్లో రకుల్ ప్రీత్ సింగ్ దిట్ట. చిన్నప్పుడే సెంట్రల్ స్కూల్లో చదివిన రకుల్ టకాటకాక లెక్కలను చెప్పేస్తుంది. 
 
చిన్నచిన్న యాడ్స్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్‌కు చిత్తూరు జిల్లాలో ఒక యాడ్ చేసిన తరువాత ఆమె దశ, దిశ మారిపోయింది. అదే అపూర్వ బట్టల షాపు యాడ్. ఆమె 2010 సంవత్సరంలో అపూర్వ యాడ్‌లో నటించిన తరువాత ఆమెను చూసిన ఒక తెలుగు డైరెక్టర్ తెలుగు సినిమాలో అవకాశం ఇచ్చారు. సినిమాలో నటిస్తూనే 2011లో ఫెమీనా అవార్డులో అందగత్తెగా అవార్డు అందుకుంది ఢిల్లీ భామ. ఆ తరువాత తెలుగు సినిమాల్లో అడపాదడపా నటిస్తూ వచ్చింది. 
 
ఒక్క తెలుగులోనే కాదు 2009లో కన్నడ, 2014లో బాలీవుడ్ ఇలా వివిధ భాషల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చింది. సాధారణ మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించిన రకుల్ ఇప్పుడు తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. హీరోయిన్లు అది చేస్తేనే అవకాశం వస్తుందని చాలామంది చెబుతుంటారు. 
 
కొంతమందైతే బహిరంగంగానే ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంటారు. కానీ రకుల్ మాత్రం కష్టపడి పైకొచ్చిందంటున్నారు ఆమె తల్లిదండ్రులు. హైదరాబాద్‌లోనే స్థిరపడ్డ ఈ ఢిల్లీ భామ హైదరాబాద్‌లో సొంతంగా జిమ్ కూడా నడుపుతోందట. గచ్చిబౌలిలో ఎఫ్-45 పేరుతో సొంతంగా జిమ్‌ను నడుపుతోంది రకుల్. రకుల్ ఈ జిమ్‌ను నడుపుతోందని తెలిసిన హైదరాబాద్ యువకులు క్యూ కట్టి మరీ జిమ్‌కు వెళుతున్నారట.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments