Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో ఎవడితోనో... అని రాస్తే ఏం చేయాలి? ట్వీట్ బైట పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (21:59 IST)
సామాజిక మాధ్యమాలు వున్నాయి కదా అని కొందరు మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నటి రకుల్ ప్రీత్ సింగ్ వేసుకున్న దుస్తులపై కామెంట్ చేసిన ఓ నెటిజన్ దారుణంగా రాశాడు. కారులో ఎవరితోనో.. అంటూ చెప్పలేని కామెంట్ పెట్టాడు. తొలుత దీనిని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించలేదు. ఐతే ఆ తర్వాత ఆమె అతడిపై చేసిన కామెంట్లకు కొందరు నెటిజన్లు ప్రశ్నించడం మొదలుపెట్టడంతో... అతడు పెట్టిన ట్వీట్ సారాంశాన్ని మొత్తం బయటపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. 
 
కాగా ఇటీవల ముంబైకు వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్ కురచ దుస్తులు ధరించి, కారు దిగుతూ కనిపించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటలోలకు ఓ యువకుడు దారుణమైన కామెంట్ పెట్టాడు. వీటిపై రకుల్ ప్రీత్ స్పందించింది. ఆ యువకుడిని చీవాట్లు పెడుతూనే అతని తల్లిని కూడా ఈ వివాదంలోకి లాగింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
'నీపై వచ్చిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చేందుకు నువ్వు కూడా ఓ మహిళనే అవమానిస్తావా' అంటూ ఓ నెటిజన్ ప్రశ్నిస్తే.. 'అసలు నువ్వు ఎలాంటి దుస్తులు ధరించావో తెలుసా' అని మరొకరు, 'నీ వాలకం చూస్తుంటే ఎలాగైనా అనుకోవచ్చు' అంటూ ఇంకో నెటిజన్ ప్రశ్నించాడు. ఇలా సాగింది రకుల్ ప్రీత్‌పై నెటిజన్ల ట్రోలింగ్. 
 
రకుల్ కామెంట్‌ను అతికొద్దిమంది మాత్రమే సమర్ధించగా, పలువురు విమర్శించారు. ఇక తనపై వస్తున్న ట్రోలింగ్‌ను చూస్తున్న రకుల్, తన ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించింది. 'నా నీతి, నిజాయితీలను ప్రశ్నిస్తున్నవారు మహిళలను లక్ష్యం చేసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఇటువంటి సంకుంచిత మనస్కులకు బుద్ధి చెప్పేందుకు నాకు వచ్చిన పదాలను నేను వాడాను. వారికి కూడా ఓ కుటుంబం ఉందని గుర్తు చేయాలన్నదే నా అభిప్రాయం. నాపై వచ్చిన కామెంట్లే వారిపైనా వస్తే..? అతని తల్లి లాగి ఒకటిస్తుందనే అనుకుంటున్నా' అంటూ కౌంటరిచ్చింది. 
 
తాజాగా అసలడతడు ఎలాంటి కామెంట్ పెట్టాడో చూపిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు రకుల్. దీనితో ఆమెపై విమర్శనాస్త్రాలు సంధించేవారు కిక్కురుమనడంలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments