Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ తీసుకునే తనూశ్రీ.. ఈరోజు పెద్దపెద్ద కబుర్లు చెబుతోంది : రాఖీసావంత్

Webdunia
సోమవారం, 22 అక్టోబరు 2018 (09:20 IST)
ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తాపై మరో బాలీవుడ్ సెక్సీ క్వీన్ రాఖీ సావంత్ సంచలన ఆరోపణలు చేసింది. డ్రగ్స్ తీసుకుని స్పృహ లేకుండా పడిపోయే తనూశ్రీ ఇపుడు పెద్దపెద్ద కబుర్లు చెబుతోందంటూ ఆరోపణలు గుప్పించింది. దీంతో రాఖీ సావంత్‌పై తనూశ్రీ దత్తా రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేసింది.
 
'మీటూ' ఉద్యమంలో భాగంగా నటుడు నానా పాటేకర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తనూశ్రీ దత్తా ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఈ ఉదంతంలో పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తనుశ్రీకి మద్దతు పలికారు. కానీ, నటి రాఖీ సావంత్ బాధితురాలు తనుశ్రీపై పలు ఆరోపణలు గుప్పించారు. 
 
అంతేకాకుండా, తనుశ్రీ డ్రగ్స్ తీసుకుని వ్యాన్‌లో ఉండగా, తాను నానా పాటేకర్ సలహా మేరకు ఒక సాంగ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కాంట్రావర్సీ క్వీన్ రాఖీపై తనుశ్రీ రూ.10 కోట్ల మేరకు పరువునష్టం దావా వేశారు. 
 
ఈ ఉదంతం గురించి రాఖీ గతంలో మీడియాతో మాట్లాడుతూ 'ఆరోజు తనుశ్రీ డ్రగ్స్ తీసుకుని వ్యాన్‌లో 4 గంటల పాటు స్పృహ లేకుండా పడివుంది. ఈ రోజు పెద్దపెద్ద కబుర్లు చెబుతున్న తనుశ్రీ అసలు బాగోతం బయపెట్టాలనుకుంటున్నాను. ఆ పాట నేను పూర్తి చేసినందుకు తనుశ్రీ నాకు నోటీసు కూడా పంపించింది. అయితే సినిమా యూనిట్ నన్ను కాపాడింది' అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం