Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పద్మావత్' చిత్రాన్ని ప్రదర్శిస్తే థియేటర్లను తగులబెడతాం : రాజ్‌పుత్

'పద్మావత్' చిత్ర విడుదలకు ఇంకా అడ్డంకులు తొలగినట్టు కనిపించడం లేదు. ఈ చిత్ర విడుదలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడమే కాకుండా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిషేధాన్ని తొలగ

Webdunia
గురువారం, 18 జనవరి 2018 (17:29 IST)
'పద్మావత్' చిత్ర విడుదలకు ఇంకా అడ్డంకులు తొలగినట్టు కనిపించడం లేదు. ఈ చిత్ర విడుదలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడమే కాకుండా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిషేధాన్ని తొలగించింది. దీంతో నిర్మాత ఊపిరి పీల్చుకున్నారు. 
 
అయితే, ఈ చిత్ర విడుదలను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న రాజ్‌పుత్ వర్గీయులు మాత్రం ఏమాత్రం తలొగ్గడం లేదు. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాను విడుదల చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. తమ వినతులను పట్టించుకోకుండా ఆ సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగులబెడతామని తాజాగా హెచ్చరించారు. పైగా, ఈ చిత్రాన్ని నిషేధించాల్సిందేనని డిమాండ్ చేశారు.
 
రాణి పద్మావతి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీశారని రాజ్‌పుత్‌లు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించగా సుప్రీంకోర్టు మాత్రం ఈ సినిమా విడుదలకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ రాజ్‌పుత్‌లు ఆందోళనకు దిగుతామని హెచ్చరించడంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు రైతుల మృతి

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments