Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ కుమార్తెకు మళ్లీ పెళ్లి.. వరుడు ఎవరంటే...

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (14:58 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య మళ్లీ పెళ్లి కుమార్తె కానుంది. ఆమెకు వచ్చే నెలలో రెండో పెళ్ళి జరుగనుంది. ఒక బిడ్డ తల్లిగా ఉన్న సౌందర్యకు తొలుత 2010లో తొలిసారి వివాహమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్‌తో పెళ్లి జరిగింది. ఆ తర్వాత వీరికి వేద్ కృష్ణ అనే ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కానీ, భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా గత 2017లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 
 
అప్పటినుంచి సౌందర్య ఒంటరిగానే ఉంది. దీంతో ఆమెకు రెండో పెళ్లి చేయాలని రజినీకాంత్ నిర్ణయం తీసుకుని, కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త విశాగన్ వనంగమూడి అనే వరుడును ఎంపిక చేశారు. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది. వీరి వివాహం వచ్చే నెల 11వ తేదీన జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇందులోభాగంగా 9వ తేదీన మెహందీ, సంగీత్ వేడుకలు నిర్వహిస్తారు. చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో ఈ వేడుకలు జరుగున్నాయి. 
 
కాగా, విశాగన్‌కు కూడా ఇది రెండో వివాహమే. ఆయన వంజగర్ ఉలగమ్ అనే సినిమాతో తమిళ తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహ నటుడిగా పనిచేశారు. సినిమాలతో పాటు ఆయన ఫార్మాస్యూటికల్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఇక సౌంద‌ర్య‌ కూడా ఇటు దర్శకురాలిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. కెరీర్ తొలినాళ్ళ‌లో గ్రాఫిక్ డిజైన‌ర్‌గా ప‌ని చేసింది సౌంద‌ర్య‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments