Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ కుమార్తెకు మళ్లీ పెళ్లి.. వరుడు ఎవరంటే...

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (14:58 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య మళ్లీ పెళ్లి కుమార్తె కానుంది. ఆమెకు వచ్చే నెలలో రెండో పెళ్ళి జరుగనుంది. ఒక బిడ్డ తల్లిగా ఉన్న సౌందర్యకు తొలుత 2010లో తొలిసారి వివాహమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్‌తో పెళ్లి జరిగింది. ఆ తర్వాత వీరికి వేద్ కృష్ణ అనే ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కానీ, భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా గత 2017లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 
 
అప్పటినుంచి సౌందర్య ఒంటరిగానే ఉంది. దీంతో ఆమెకు రెండో పెళ్లి చేయాలని రజినీకాంత్ నిర్ణయం తీసుకుని, కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త విశాగన్ వనంగమూడి అనే వరుడును ఎంపిక చేశారు. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది. వీరి వివాహం వచ్చే నెల 11వ తేదీన జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇందులోభాగంగా 9వ తేదీన మెహందీ, సంగీత్ వేడుకలు నిర్వహిస్తారు. చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో ఈ వేడుకలు జరుగున్నాయి. 
 
కాగా, విశాగన్‌కు కూడా ఇది రెండో వివాహమే. ఆయన వంజగర్ ఉలగమ్ అనే సినిమాతో తమిళ తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహ నటుడిగా పనిచేశారు. సినిమాలతో పాటు ఆయన ఫార్మాస్యూటికల్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఇక సౌంద‌ర్య‌ కూడా ఇటు దర్శకురాలిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. కెరీర్ తొలినాళ్ళ‌లో గ్రాఫిక్ డిజైన‌ర్‌గా ప‌ని చేసింది సౌంద‌ర్య‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments