Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ దర్శకుడు మలినేని గోపీచంద్‌కు సూపర్ స్టార్ ఫోన్‌ కాల్

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (11:53 IST)
టాలీవుడ్ దర్శకుడు మలినేని గోపీచంద్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి ఫోన్ కాల్ వెళ్లింది. ఈ విషయాన్ని గోపీచంద్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇటీవల బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో "వీరసింహారెడ్డి" చిత్రం వచ్చింది. ఇది ఘన విజయం సాధించింది. 
 
పైగా మంచి వసూళ్లను రాబట్టింది. బాలయ్య మాస్ అప్పీరెన్స్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని గోపీచంద్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ వీక్షించారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేనికి ఫోన్ చేసి అభినందించినట్టు దర్శకుడు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
"ఇది నాకు నమ్మలేని నిజం. సూపర్ స్టార్, తలైవర్ రజనీకాంత్ సార్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన "వీరసింహారెడ్డి" సినిమను చూశారు. ఆయనకు ఎంతో నచ్చింది. సినిమాను ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన భావోద్వేగం ఈ ప్రపంచంలో తనకు అన్నింటికంటే ఎక్కువ. థ్యాంక్యూ రజనీ సార్" అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments