Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై సామూహిక అత్యాచారం.. దుస్తులు లేకుండా రోడ్డుపై పరుగులు

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (16:10 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళను కొందరు కామాంధులు చెరబట్టి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను నగ్నంగా రోడ్డుపై పరుగులు తీయించారు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని బిల్వారా ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తనను కలవాలని ఆ వ్యక్తి కోరాడు. అందుకు ఆ మహిళ నిరాకరించింది. ఈ క్రమంలో ఆ మహిళ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్ళగా, ఆమెను ఫాలో అవుతూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అయితే, ఆ కామాంధుల నుంచి తప్పించుకున్న ఆ మహిళ... శరీరంపై దుస్తులు లేకుండానే నగ్నంగా పరుగెత్తుతూ గ్రామానికి చేరుకుంది. దీన్ని గమనించిన ఆ గ్రామస్థులు ఆ మహిళకు దుస్తులు ఇచ్చి, పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడిన చోటు, గిరిధర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments