Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడు నా దృష్టి మొత్తం దానిపైనేనంటున్న రాజమౌళి

Webdunia
బుధవారం, 6 మే 2020 (22:24 IST)
దర్సకధీర రాజమౌళి లాక్ డౌన్ సమయంలో ఏదో పెద్ద ప్రాజెక్టే ప్లాన్ చేస్తుంటారని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఎందుకంటే ఖాళీగా ఉంటే మంచి ప్రాజెక్టును ఎంచుకోవడం.. ఆ సినిమాను భారీ విజయంవైపు తీసుకెళ్ళడం రాజమౌళికి ఉన్న అలవాటు. ఆయన ఏ సినిమా చేసినా అది సూపర్ డూపర్ హిట్టే. 
 
అందుకే రాజమౌళిని దర్సకధీరుడని తెలుగు సినీపరిశ్రమలో పొగుడుతుంటారు. ఈ మధ్య మీడియా ముందుకు వచ్చిన రాజమౌళి లాక్ డౌన్ సమయంలో జనం ఇళ్ళలోనే ఉండాలని కోరారు. తాను ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్. సినిమాపైనే దృష్టి పెట్టానని స్పష్టం చేశారు.
 
కానీ ఇన్‌స్టాగ్రాం ద్వారా రాజమౌళికి ఒకటే సందేశాలు పోతున్నాయట. మీలాంటి వారు రామాయణం లాంటి కథను తీసుకుని సినిమా తీస్తే అద్భుతంగా ఉంటుందని అభిమానులు ఒకటే సందేశాలను పంపిస్తున్నారట. దీంతో రాజమౌళి అభిమానుల కోసం ఒక సందేశం తాజాగా పంపాడట. రామాయణం కన్నా నాకు మహాభారతం చేయాలన్న కోరిక ఉంది. 
 
కానీ ఆ ప్రాజెక్టు ఇప్పుడు కాదు. ఆషామాషీగా చేసే ప్రాజెక్టు కాదది. ఇప్పుడు నాకు ఆర్.ఆర్.ఆర్.సినిమా ఎలా పూర్తి చేయాలా అన్న దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టాను. ఆ సినిమా గురించే నా ఆలోచన అంతా అంటున్నారట రాజమౌళి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments