నాని పని అయిపోయింది, ఇక రాజ్ తరుణ్ వంతు వచ్చింది

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (13:12 IST)
డిఫరెంట్‌ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా ప్రేక్షకులను మరింతగా ఎంటర్‌టైన్‌ చేయడానికి సిద్ధమవుతోంది. రీసెంట్‌గా ఆహాలో విడుదలైన భానుమతి అండ్‌ రామకృష్ణ, జోహార్‌ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన వి సినిమా రిలీజైంది.
 
అదే కోవలో యువ కథానాయకుడు రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన రొమ్‌కామ్‌ ఒరేయ్‌ బుజ్జిగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల చేయడానికి సన్నద్ధమవుతుంది. ఈ చిత్రానికి విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహించారు. మాళవికా నాయర్‌, హెబ్బాపటేల్‌ హీరోయిన్స్‌గా నటించారు.
 
కుమారి 21 ఎఫ్‌లో సూపర్బ్‌ కెమిస్ట్రీతో హిట్‌ పెయిర్‌గా నిలిచిన రాజ్‌తరుణ్‌, హెబ్బాపటేల్ మరోసారి ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది. అతి తక్కువ సమయంలోనే ఆహా ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుంది.
 
అభిమాన అగ్ర తారలు నటించిన క్లాసికల్‌ లైబ్రరీ ఆహా సొంతం. అందుకనే... అతి తక్కువ సమయంలో ఆహా తనదైన స్థానాన్ని సొంతం చేసుకుని ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌కురువిళ్ళ, సప్తగిరి, రాజారవీంద్ర, అజయ్‌ఘోష్‌, అన్నపూర్ణమ్మ‌, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధు నందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వి సినిమా రిలీజ్ తో నాని పని అయిపోయింది. మరి.. ఇప్పుడు రాజ్ తరుణ్ వంతు వచ్చింది. ఈ సినిమా ఏ స్ధాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments