Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంధు ప్రీతిపై ఒరేయ్‌ బుజ్జిగా ఏమన్నాడంటే..?

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2020 (16:49 IST)
rajtarun
యువ కథానాయకుడు రాజ్‌ తరుణ్‌ బంధు ప్రీతి గురించి తాజాగా స్పందించారు. బయట నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వ్యక్తిని అయినప్పటికీ బంధుప్రీతి కారణంగా ఇప్పటివరకూ తాను ఎలాంటి ఆఫర్స్‌ కోల్పోలేదు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కొంచెం ఎక్కువగా కష్టపడాలని మాత్రం తనకు అర్థమైంది. 
 
తెలుగు సినీ పరిశ్రమ టాలెంట్‌కు పెద్దపీట వేస్తుందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కాబట్టి టాలెంట్‌ ఉంటే తప్పకుండా ఎవరైనా ఇక్కడ రాణించగలరని రాజ్‌ తరుణ్‌ తెలిపారు. కథానాయకుడిగా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టకముందు నుంచే దర్శకుడిగా రాణించాలనే కల ఉండేది. కథలు రాయడమంటే తనకెంతో ఇష్టం. అలా రాసిన ప్రతిసారీ తప్పకుండా ఓ రోజు ఆ కథలతో సినిమా చేయాలనుకునేవాడిని అని తెలిపాడు. 
 
కానీ ప్రస్తుతానికి తన దృష్టంతా నటన మీదే ఉంది. 'ఒరేయ్‌ బుజ్జిగా' చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్‌ కుమార్‌ కొండా టాలెంట్‌ ఉన్న వ్యక్తి. ఆయనతో తనకు ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తామిద్దరం కలిసి మరో సినిమా కోసం పనిచేస్తున్నాం. ప్రస్తుతం దాని షూటింగ్‌ జరుగుతోంది. మరోవైపు ఓ నూతన దర్శకుడితో కలిసి పనిచేస్తున్నాను. లాక్‌డౌన్‌ సమయంలో ఎన్నో కథలు విన్నాను. వాటిల్లో చాలా కథలు ఆసక్తిగా ఉన్నాయి. ప్రస్తుతం అవి చర్చల దశలో ఉన్నాయి. ఫైనల్‌ కాగానే ప్రకటిస్తానని తెలిపాడు. 
 
కాగా, తాజాగా విడుదలైన 'ఒరేయ్‌ బుజ్జిగా' చిత్రంలో రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటించారు. మాళవికా నాయర్‌ కథానాయిక. హెబ్బా పటేల్‌ కీలకపాత్ర పోషించారు. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాధామోహన్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమా 'ఆహా' వేదికగా అక్టోబర్‌ 1న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments