Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌లో పదిమంది దాడి.. ఎమ్మెల్యే రోహిత్ బంధువులపై రాహుల్ ఫిర్యాదు..

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (14:31 IST)
బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లగింజ్ దాడికి గురైనట్లు వార్తలొచ్చాయి. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌లో జరిగిన ఈ దాడిపై రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రాహుల్.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులపై ఫిర్యాదు చేశాడు. తనతో ఉన్న యువతుల పట్ల వాళ్లు అసభ్యంగా ప్రవర్తించారని, ఇదేంటని అడిగితే.. తనపై బీర్ బాటిళ్లతో దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు. 
 
దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్లు వెల్లడించాడు. న్యాయం జరుగుతుందని తనకు నమ్మకం ఉందని, పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. తాను ఒక్కడినే ఉన్నానని, వాళ్లు పది మంది కలిసి వచ్చి దాడి చేశారని చెప్పాడు. తనతో ఉన్న యువతులపైనా రోహిత్ రెడ్డి బంధువులు దాడి చేశారని చెప్పాడు. 
 
కాగా బుధవారం రాత్రి గచ్చిబౌలిలో ప్రిజమ్ పబ్‌కి తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లగా.. అక్కడ ఆమె పై కొంత మంది యువకులు అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై నిలదీసిన రాహుల్‌పై దాడి జరిగింది. దీంతో అతనని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments