జూ.ఎన్టీఆర్ విలన్ గుండెపోటుతో కన్నుమూత

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించి, జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన చిత్రం "యమదొంగ". ఈ చిత్రంలో విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా కన్నుమూశారు. ఆయన బుధవారం గుండెపోటు రావడంతో చనిపోయారు.

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (12:07 IST)
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించి, జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన చిత్రం "యమదొంగ". ఈ చిత్రంలో విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా కన్నుమూశారు. ఆయన బుధవారం గుండెపోటు రావడంతో చనిపోయారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. 
 
తన కెరీర్ ప్రారంభంలో మోడలింగ్‌తో పాటు, టీవీ సీరియల్స్‌లోనూ నటించిన ఆయన ఆ తర్వాత పలువురు అగ్రహీరోల చిత్రాల్లో ప్రతినాయకునిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. నరేంద్ర ఝా 2002లో 'ఫంటూష్' అనే చిత్రం ద్వార బాలీవుడ్ వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత 'గదర్', 'రాయీస్', 'మొహంజోదారో' వంటి హిందీ చిత్రాల్లో నటించారు. 
 
తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'యమదొంగ', యువరత్న బాలకృష్ణ చిత్రం 'లెజండ్', హీరో ప్రభాస్ నటించిన 'ఛత్రపతి', తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలీ' వంటి తదితర హీరోల చిత్రాల్లో నటించారు.

అలాగే, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా త్వరలో రానున్న హిందీ చిత్రం 'రేస్-3'లో ఆయన విలన్‌ రోల్‌లో కనిపించనున్నారు. కాగా, ఝా మృతిపట్ల పలువురు నటీనటులు, నిర్మాతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments