Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధిక కుమారస్వామి ప్రధాన పాత్రధారిణిగా "సంహారిణి"

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (17:18 IST)
శ్రీ లక్ష్మీ వృషద్దరి ప్రొడక్షన్స్, గీత ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో రాధికా కుమార స్వామి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం "సంహారిణి". 1980లో ఒక రాజు కుటుంబంలో జరిగే కథ. 2019లో కూడా కొనసాగుతుంది. హారర్, కామెడీ, థ్రిల్లర్‌తో రూపొందిన ఈ చిత్రానికి నవరసన్ దర్శకత్వం వహించారు. 
 
రాజు కుమార్తె దమయంతి పాత్రలో రాధికా కుమారస్వామి నటించారు, అలాగే రాజు పాత్రలో తమిళ సీనియర్ నటుడు నటించాడు. ఈ పాత్ర పేరు రాజ బహుదూర్ విజయేంద్ర వర్మ. ఈ చిత్రాన్ని బెంగళూర్, మైసూర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరిగింది. 
 
ఈ చిత్రంలో రాధిక కుమారస్వామి నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ చిత్రం కోసం మూడు అద్భుతమైన భారీ సెట్స్ వేసారు. విజువల్స్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా అద్భుతమైన గ్రాఫిక్స్ వర్కుతో ఈ చిత్రం ఉంటుంది.
 
ఈ మూవీలో సందర్భానుసారం మూడు పాటలు ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకొని నవంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. చిత్రం విడుదల ముందు ఆడియో విడుదల చెయ్యనున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.
 
నటీనటులు:
రాధిక కుమారస్వామి, భజరంగి లోకి, సాధు కోకిల, తబల నాని, మిత్ర,
మ్యూజిక్: ఆర్.ఎస్. గణేష్ నారాయణ్
కెమెరామెన్: పి.కె.హెచ్.దాస్
ఎడిటింగ్: మహేష్ రెడ్డి
సమర్పణ: శ్రీ లక్ష్మీ వృశుద్ధరి ప్రొడక్షన్స్
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం:  నవరసన్

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments