Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనెందుకు క్షమాపణ చెప్పాలి... నాకేం అసూయ లేదు..

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (17:25 IST)
ఇటీవల కోలీవుడ్‌లో తమిళ సీనియర్ నటుడు రాధారవి లేడీ సూపర్ స్టార్ నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వలన రేగిన దుమారం ఇంకా సాగుతూనే ఉంది. ఆ సమయంలో రాధారవిపై పలువురు సినీ ప్రముఖులు నిప్పులు చెరిగారు. అయినా కూడా రాధారవి దూకుడు తగ్గలేదు. ఇప్పటికీ తాను చేసిన వ్యాఖ్యలలో తప్పు లేదనే అంటున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో ఈ దుమారంపై మళ్లీ ఆయన స్పందించారు. 
 
మీరు నయనతారకు క్షమాపణలు చెప్పారా అని అడగ్గా, నా వ్యాఖ్యల్లో తప్పేముందో నయనతార చెప్పాలి. ఆ వ్యాఖ్యల వలన బాధపడ్డానని నయనతార చెప్తే అప్పుడు క్షమించమని కోరుతానని పేర్కొన్నాడు. అయినా ఎవరో కొందరు తప్ప మిగిలినవారంతా సమర్ధించారంటే నావైపు నిజం ఉన్నట్లే కదా అని తెలిపారు. 
 
మీరు ఆమెపై అసూయతోనే వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలపై ఎలా స్పందిస్తారని అడగ్గా... అలా అయితే నా తర్వాత ఎంతోమంది నటీనటులు నా స్టార్స్‌గా ఎదిగారు. మరి నేనెందుకు వాళ్లని అనలేదని ఎదురు ప్రశ్నించారు. 
 
సినిమా రంగంలో నటీనటుల మధ్య పోటీని నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ఎవరి ప్రత్యకత వాళ్లకు ఉంటుంది. ఎవరి పారితోషికం వాళ్లకు వస్తుంది. ఇందులో అసూయ పడాల్సినవసరం లేదని తెలిపారు. పారితోషికం తక్కువైనంత మాత్రాన నా నటన విలువ తగ్గిపోదని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments