Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనెందుకు క్షమాపణ చెప్పాలి... నాకేం అసూయ లేదు..

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (17:25 IST)
ఇటీవల కోలీవుడ్‌లో తమిళ సీనియర్ నటుడు రాధారవి లేడీ సూపర్ స్టార్ నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వలన రేగిన దుమారం ఇంకా సాగుతూనే ఉంది. ఆ సమయంలో రాధారవిపై పలువురు సినీ ప్రముఖులు నిప్పులు చెరిగారు. అయినా కూడా రాధారవి దూకుడు తగ్గలేదు. ఇప్పటికీ తాను చేసిన వ్యాఖ్యలలో తప్పు లేదనే అంటున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో ఈ దుమారంపై మళ్లీ ఆయన స్పందించారు. 
 
మీరు నయనతారకు క్షమాపణలు చెప్పారా అని అడగ్గా, నా వ్యాఖ్యల్లో తప్పేముందో నయనతార చెప్పాలి. ఆ వ్యాఖ్యల వలన బాధపడ్డానని నయనతార చెప్తే అప్పుడు క్షమించమని కోరుతానని పేర్కొన్నాడు. అయినా ఎవరో కొందరు తప్ప మిగిలినవారంతా సమర్ధించారంటే నావైపు నిజం ఉన్నట్లే కదా అని తెలిపారు. 
 
మీరు ఆమెపై అసూయతోనే వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలపై ఎలా స్పందిస్తారని అడగ్గా... అలా అయితే నా తర్వాత ఎంతోమంది నటీనటులు నా స్టార్స్‌గా ఎదిగారు. మరి నేనెందుకు వాళ్లని అనలేదని ఎదురు ప్రశ్నించారు. 
 
సినిమా రంగంలో నటీనటుల మధ్య పోటీని నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ఎవరి ప్రత్యకత వాళ్లకు ఉంటుంది. ఎవరి పారితోషికం వాళ్లకు వస్తుంది. ఇందులో అసూయ పడాల్సినవసరం లేదని తెలిపారు. పారితోషికం తక్కువైనంత మాత్రాన నా నటన విలువ తగ్గిపోదని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments