Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతారను కదిలించాడు.. ఇప్పుడేమో విశాల్‌ను పట్టుకున్నాడు.. ఎవరు?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (15:25 IST)
ఇటీవల నయనతారపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి... సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన తమిళ సీనియర్ నటుడు రాధారవి... తాజాగా స్టార్ హీరో విశాల్ గురించి చాలా వ్యంగ్యంగా ట్వీట్ చేయడం జరిగింది.
 
వివరాలలోకి వెళ్తే... ఇటీవల నయనతారను కించపరుస్తూ రాధారవి చేసిన కామెంట్స్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విశాల్... ‘‘రాధారవి గారూ.. మహిళల గురించి, ముఖ్యంగా ఒక నటిని గురించి మీరు చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. ఒక మహిళ వల్లనే మీరు పెరిగి పెద్దవారయ్యారనే కనీస జ్ఞానం కూడా మీకు లేదు. మహిళలంటే గౌరవం లేని మీరు.. మీ పేరులోని 'రాధ'ను తొలగించి.. 'రవి' అని మాత్రమే పిలుపించుకోండి’’ అంటూ ట్వీట్ చేసాడు.
 
ఈ ట్వీట్‌కి ప్రతిస్పందించిన రాధారవి వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ... "విశాల్‌కి ఏమీ తెలియదు.. కానీ అన్ని విషయాల్లో తల దూర్చుతుంటాడు. 'రాధ' అనేది మా తండ్రిగారి పేరు.. అందుకే అది నా పేరుకు ముందు వచ్చింది" అని ట్వీట్ చేసారు. మొత్తం మీద ప్రశాంతంగా ఉన్న కోలీవుడ్‌లో రాధారవి కారణంగా ఏదో అలజడి రేగబోతోన్నట్లు ఉంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Trump, 146 కోట్ల మంది భారతీయులు అమెరికా కంపెనీలను బహిష్కరిస్తే?: ఆప్ ఎంపీ నిప్పులు

శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోని ఖజానా బి తెరవడంపై మళ్లీ రచ్చ రచ్చ

రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం పెరిగినట్లు కనిపిస్తోంది: కేటీఆర్

చేయని నేరానికి జైలుశిక్ష - రూ.11 కోట్ల పరిహారం

Pulivendula: హీటెక్కిన పులివెందుల రాజకీయాలు.. టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య ఘర్షణలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments