Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మకు షాకిచ్చిన థియేటర్ యజమానులు

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (09:57 IST)
ప్రముఖ టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ, తెలంగాణాలోని పీవీఆర్ సినిమా, ఐనాక్స్ సినిమాస్‌లు తేరుకోలేని షాకిచ్చారు. ఆయన తాజాగా తెరకెక్కించిన "డేంజరస్" చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించేందుకు నిరాకరించారు. ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య ఆకర్షణ, ప్రేమ, వారి మానసిక పరిస్థితి వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
 
 
పైగా, ఒక క్రైమ్ థ్రిల్లర్. భారతదేశ సినీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇందులో ఇద్దరు అమ్మాయిల మధ్య డ్యూయెట్ సాంగ్ కూడా ఉంది. ఈ నెల 8వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్‌ను సెన్సార్ బోర్డు మంజూరు చేసింది. 
 
ఇపుడు ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యాలు నిరాకరించారు. ఈ విషయాన్ని వర్మ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్‌లు ఖత్రా (డేంజరస్) చిత్రాన్ని ప్రదర్శించేందుకు నిరాకరించాయి. సుప్రీంకోర్టు సెక్షన్ 377ను రద్దు చేసింది. సెన్సార్ బోర్డు ఆమోదించిన తర్వాత ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుది. ఎల్జీబీటీ కమ్యూనిటి మాత్రమే కాకుండా పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్‌కు వ్యతిరేకంగా నిలబడాలని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. ఇది మానవ హక్కులను అవమానించడమే అవుతుంది అని వర్మ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments