ఆర్ఆర్ఆర్‌ను టార్గెట్ చేస్తోన్న పుష్ప-2.. మార్చిలో రిలీజ్ అవుతుందా?

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (18:19 IST)
అల్లు అర్జున్, సుకుమార్ జంటగా నటించిన "పుష్ప" చిత్రానికి సీక్వెల్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. "పుష్ప"కి సీక్వెల్‌గా వస్తున్న "పుష్ప ది రూల్" షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 
 
ఇప్పటివరకు చిత్రీకరణ 40శాతం మార్కును మాత్రమే చేరుకుంది. మొత్తం షూటింగ్ జనవరి 2024 కల్లా పూర్తవుతుందని సినీ యూనిట్ అంచనా వేస్తున్నారు. 
 
అయితే ఈ సినిమా మార్చి నాలుగో వారంలో విడుదలయ్యే ఛాన్సుందని టాక్ వస్తోంది. అంతేగాకుండా ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసేందుకు పుష్ప -2 సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఎన్టీఆర్- కొరటాల "దేవర" ఏప్రిల్ 5న విడుదల కానుండగా, "పుష్ప-2"ను మార్చిలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు.
 
కాబట్టి జనవరిలోగా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయగలిగితేనే రిలీజ్ డేట్ ఖరారు అవుతుంది. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, అనసూయ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాష్ట్రంలో ప్రతిరోజూ 7,200 టన్నుల చెత్త: చెత్త శుద్ధి ప్లాంట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

మోటార్లకు మీటర్లు అమర్చినా.. ఉచిత విద్యుత్ నిలిపివేసినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయం : సీఎం రేవంత్ సవాల్

మమతా బెనర్జీ మేనల్లుడుపై భౌతికదాడి.. రాళ్లు - కోడిగుడ్లు - చెప్పులతో...

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

తర్వాతి కథనం
Show comments