Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలియా-రణ్‌బీర్‌లను టార్గెట్ చేసిన కంగనా రనౌత్.. అది ఫేక్ మ్యారేజ్ అంటూ?

kangana
, మంగళవారం, 18 జులై 2023 (17:38 IST)
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ మళ్లీ అలియా-రణ్‌బీర్‌ను టార్గెట్ చేసింది. వారిది ఫేక్ మ్యారేజ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలియా-రణ్‌వీర్ జంటను "ఫేక్" అని పిలిచింది. అయితే గుప్తంగా పోస్ట్ చేసింది. ఎటువంటి పేర్లు తీసుకోకుండా, నటి సినిమాల సూచనలను ఇచ్చింది. 'సినిమా ప్రమోషన్ల' కోసం పెళ్లి చేసుకున్నారని, వారిని 'ఫర్జీ' అని పిలిచారని, అంటే నకిలీ అని కూడా ఆమె ఆరోపించింది. 
 
ఈ వ్యాఖ్యలు చాలామటుకు అలియా-రణ్‌బీర్‌ను టార్గెట్ చేసినట్లు సినీ జనం అనుకుంటున్నారు. ప్రేమ కోసం కాకుండా డబ్బు కోసం పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇలానే వుంటుందంటూ కంగనా పోస్ట్ చేసింది. తన కొత్త సినిమాపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆమె స్పందించింది. 
 
కంగనా రనౌత్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కలిసి సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం చేయబోతున్నట్లు తెలిపింది. భార్య, బిడ్డను వదిలేసి భర్త విహారయాత్ర వెళ్తే దాని గురించి ఎవరూ రాయరు. సదరు భర్త తనకు విజ్ఞప్తి చేస్తున్నాడు. చర్చించేందుకు తనను కలవమంటున్నాడు. ఆ నటుడు మాఫియా డాడీ ఒత్తిడిలో పెళ్ళి చేసుకున్నాడని కంగనా రనౌత్  వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యంగ్ డైరెక్టర్లతో మెగాస్టార్ చిరంజీవి... తాజాగా అనిల్ రావిపూడికి ఛాన్స్